ఇల్లు కొనుగోలుదారులకు, రియల్ ఎస్టేట్ రంగానికి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఓ శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయట. రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ప్రోత్సాహం దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ స్టేటస్ పొందవచ్చు. అది కూడా బడ్జెట్కు ముందే అని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయట. కొత్త సంవత్సరం ఆరంభంలో ఈ భారీ ఆఫర్ ముందుకు రావొచ్చునని, అది ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెబుతున్నారు.

రియల్ ఎస్టేట్ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్
ఇప్పటికే వివిధ రంగాలను ఆదుకునేందుకు మోడీ ప్రభుత్వం ఉద్దీపనలు ప్రకటించింది. ఇందులో భాగంగా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా రియాల్టీ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇవ్వాలని చూస్తోందని తెలుస్తోంది. కొత్త ఏడాదిలో నిర్ణయం వెలువడే అవకాశముంది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

రూ.50,000 వరకు పన్ను ప్రయోజనం
ఇది వాస్తవ రూపం దాల్చితే తమ డ్రీమ్ హౌస్ కొనుగోలు చేయాలనుకునే ట్యాక్స్ చెల్లింపుదారులకు మరిన్ని ఆదాయపు పన్ను ప్రయోజనాలు కలుగుతాయని తెలుస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే మీరు ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ అయితే ట్యాక్స్ రిబేట్ ఉంటుంది. పన్ను ప్రయోజనం రూ.50,000 వరకు ఉండొచ్చు.

రూ.50 వేలు లేదా 10 శాతం ఆదా
మీరు హోమ్ లోన్ రూపంలో ఏడాదికి రూ.5 లక్షల వరకు వడ్డీ చెల్లిస్తూ ఉంటే కనుక మీరు చెల్లించే పన్నులు దాదాపు రూ.50,000 లేదా 10% ఆదా అవుతుందని జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీ అన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి అప్లికబుల్
కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే కనుక ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ (2020) నుంచి మార్చి 31 2021 వరకు అప్లికబుల్ అవుతుందని తెలుస్తోంది. కొత్తగా ఇంటిని కొనుగోలు చేసేవారు తాము తీసుకున్న లోన్ పైన తొలి మూడేళ్ల పాటు ట్యాక్స్ రిబేట్ లభించవచ్చు. ఇప్పటికే హౌసింగ్ లోన్ పైన గత బడ్జెట్లో ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. ఇప్పుడు ఇది రియల్ ఎస్టేట్ ప్రీమియం ప్రాజెక్టులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

రియల్ రంగానికి కొత్త ఉత్సాహం
వచ్చే ఏడాది నుంచి ఇది అమలైతే రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఉత్సాహం వస్తుంది. గత నాలుగయిదేళ్లుగా రియల్ రంగంలో ఆశించినంతగా పెరుగుదల లేదని రియాల్టర్లు భావిస్తున్నారు. కాబట్టి ఈ రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని అంటున్నారు. రూ.1.8 లక్షల కోట్ల లోన్లు స్టక్ అయిపోయాయని, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే క్లియరెన్స్ లభించి ఈ రంగానికి వచ్చే ఏడాది మరింత పుంజుకుంటుందని భావిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications