న్యూఢిల్లీ: 'మీది ట్రిలియన్ డాలర్ల కంపెనీ కావొచ్చు. కానీ ప్రజల గోప్యత ముఖ్యం' అని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం వాట్సాప్కు చురకలు అంటించింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానంపై పై కీలక వ్యాఖ్యలు చేసింది. మీది రెండు మూడు ట్రిలియన్ డాలర్ల కంపెనీ కావొచ్చునని, కానీ ప్రజలు మాత్రం గోప్యతకు ప్రాధాన్యమిస్తారని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.

ప్రజల్లో ఆందోళన
యూజర్ల డేటాను తమ మాతృసంస్థ ఫేస్బుక్తో పంచుకునేందుకు వీలుకల్పించేలా వాట్సాప్ తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. కొత్త ప్రైవసీ పాలసీతో తమ వ్యక్తిగత గోప్యతను కోల్పోతామేమోనని ప్రజల్లో ఆందోళన నెలకొందని సుప్రీం కోర్టు పేర్కొంది. పౌరుల గోప్యతను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంది. ఈ పిటిషన్పై 4 వారాల్లో స్పందన తెలియజేయాలని వాట్సాప్కు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

వాట్సాప్ తరఫున కపిల్ సిబాల్
కొత్త ప్రైవసీ పాలసీ విషయంలో యూరప్తో పోలిస్తే భారత పౌరుల పట్ల వాట్సాప్ తక్కువస్థాయి ప్రమాణాలను పాటిస్తోందని పిటిషన్ దాఖలైంది. వాట్సాప్ తరఫున న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. యూరప్ మినహా ప్రపంచమంత వాట్సాప్ ఒకే విధమైన ప్రైవసీ పాలసీని అమలు చేస్తోందన్నారు. యూరప్లో ప్రత్యేక చట్టం అమల్లో ఉందని, భారత్లోనూ ఈ తరహా చట్టం తెస్తే వాట్సాప్ దానిని పాటిస్తుందన్నారు.

డేటా రక్షణ చట్టం
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ వాదనలు వినిపించారు. వ్యక్తిగత గోప్యత ప్రమాణాలను వాట్సాప్ యూరోప్ దేశాలతో పోలిస్తే భారతీయులకు తగ్గిందని పేర్కొన్నారు. వాట్సాప్ డేటాను ఫేస్బుక్తో పంచుకోకుండా నిరోధించాలని కోరారు. డేటా రక్షణ చట్టాన్ని తీసుకురావాలని దివాన్ ప్రతిపాదించారని పేర్కొన్న సుప్రీం కోర్టు, ఈ ప్రతిపాదనను అభినందించింది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications