For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Yes Bank crisis: $1.2 బిలియన్ ఇస్తానంటే... ఇన్వెస్టర్లు పట్టించుకోని నాలుగు సంకేతాలు!

|

గత గురువారం యస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మారటోరియం విధించింది. కస్టమర్లు రూ.50,000 కంటే ఎక్కువ నగదు ఉపసంహరింంచకుండా పరిమితి విధించింది. యస్ బ్యాంకు వ్యస్థాపకుడు రానాకపూర్‌ను అరెస్ట్ చేశారు. వేల కోట్ల రూపాయల అక్రమ పెట్టుబడులు పెట్టినట్లుగా, నిధులు మళ్లించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్బీఐ మారటోరియం నేపథ్యంలో యస్ బ్యాంకు షేర్లు శుక్రవారం కుప్పకూలాయి. యస్ బ్యాంకు సంక్షోభానికి సంబంధించి చాలా కాలం నుండే సంకేతాలు ఉన్నాయనేది నిపుణుల అభిప్రాయం.

యస్ బ్యాంకు సంక్షోభం, మరిన్ని కథనాలు

యస్ బ్యాంకు సంక్షోభం వార్నింగ్ సిగ్నల్స్ పట్టించుకోలేదా?

యస్ బ్యాంకు సంక్షోభం వార్నింగ్ సిగ్నల్స్ పట్టించుకోలేదా?

యస్ బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుతం డిపాజిటర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు మునిగిపోయారు. అయితే ఎస్బీఐ, ఎల్ఐసీ ఆదుకునే పరిస్థితుల్లో రానున్న కొన్నేళ్లలో లాభపడే అవకాశాలు వేరే అంశం. యస్ బ్యాంకు నుండి వచ్చిన వివిధ వార్నింగ్ సిగ్నల్స్‌ను ఇన్వెస్టర్లు పట్టించుకోలేదనేది నిపుణుల వాదన.

ఇది మొదటి సంకేతం...

ఇది మొదటి సంకేతం...

యస్ బ్యాంకు ఎన్పీఏలను రిపోర్ట్ చేయడం ప్రారంభించింది. ఇదే మొదటి సంకేతం. అంతేకాదు ఎన్పీఏలపై ఆర్బీఐ నివేదిక ఒక రకంగా ఉంటే, కంపెనీ రిపోర్ట్ మరో రకంగా ఉంది. అప్పుడైనా ఇన్వెస్టర్లు గుర్తించాల్సిందని చెబుతున్నారు.

ఏదో జరుగుతోందని...

ఏదో జరుగుతోందని...

యస్ బ్యాంకు నివేదికలతో ఆర్బీఐ విభేదించింది. యస్ బ్యాంకు కూడా దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ఇదీ సంకేతమే. యస్ బ్యాంకులో ఏదో జరుగుతుందని చెప్పడానికి ఇవి కీలక సంకేతాలుగా భావించవచ్చునని అంటున్నారు.

రానా కపూర్ తప్పుకున్న సమయంలో..

రానా కపూర్ తప్పుకున్న సమయంలో..

సీఈవోగా ఉన్న రానా కపూర్‌ను పదవి నుండి తప్పుకోమని చెప్పినప్పుడైనా సంక్షోభంలో ఉందని అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. కానీ కొత్త సీఈవో వచ్చినప్పుడు యస్ బ్యాంకుపై ఆశలు చిగురించాయి.

లోగో పట్ల ఆకర్షితుడై రూ.1.2 బిలియన్ డాలర్లు..

లోగో పట్ల ఆకర్షితుడై రూ.1.2 బిలియన్ డాలర్లు..

కేవలం యస్ బ్యాంకుకు చెందిన లోగోను ఇష్టపడి 1.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేద్దామని ఓ ఇన్వెస్టర్ రావడం, దీనిని యస్ బ్యాంకు రిజక్ట్ చేయడం.. సీరియస్‌నెస్ కనిపించడం లేదనేందుకు సంకేతాలు అంటున్నారు. అంటే నిధుల సేకరణపై సీరియస్‌నెస్ లేదనేందుకు ఇది నిదర్శనం అంటున్నారు. లోగోను ఇష్టపడి అంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తానంటే ఎందుకు పరిగణలోకి తీసుకోలేదనేది ప్రశ్నే.

ప్రభుత్వం హామీ ఇచ్చాక కూడా.. మనిషి స్వభావం..

ప్రభుత్వం హామీ ఇచ్చాక కూడా.. మనిషి స్వభావం..

రిటైల్ ఇన్వెస్టర్లు పట్టించుకోని ఎన్నో సంకేతాలు ఉన్నాయని అంటున్నారు. అయితే పెద్ద కుదుపు వచ్చినా మళ్లీ కుదురుకుంటుందని ఎక్కువమంది ఆశలు పెట్టుకుంటారు. మనిషి స్వభావం ఎక్కువగా ఇదే. అంతెందుకు.. యస్ బ్యాంకు సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. డిపాజిటర్లకు నష్టం లేకుండా చూస్తామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ ఇన్నాళ్లుగా వచ్చిన సంకేతాలను పక్కన పెట్టి ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల వద్ద మనీ విత్ డ్రా చేసుకోవడానికి వరుస కడుతున్నారు.

ఇన్వెస్టర్లు, డిపాజిటర్లకు ఊరట

ఇన్వెస్టర్లు, డిపాజిటర్లకు ఊరట

యస్ బ్యాంకును ఆదుకునేందుకు ఎస్బీఐ, ఎల్ఐసీ ముందుకు వస్తున్నాయనే వాదనలు ఉన్నాయి. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై చర్చలు మాత్రమే సాగుతున్నాయి. అయితే ఈ బ్యాంకును ఎస్బీఐ ఆదుకుంటుందనే సంకేతాలు ఇన్వెస్టర్లు, డిపాజిటర్లకు ఊరట కలిగిస్తుంది.

English summary

Yes Bank crisis: $1.2 బిలియన్ ఇస్తానంటే... ఇన్వెస్టర్లు పట్టించుకోని నాలుగు సంకేతాలు! | Yes Bank crisis: warning signs retail investors ignored

Human nature is such that unless there is major panic, you hang on to hope that things will improve. If you have five negative signals and two positive signals you prefer to hang on to those two positive signals and ignore the five negative ones.
Story first published: Monday, March 9, 2020, 11:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X