year ender 2020... ఈ ఏడాది అత్యధిక విదేశీ పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలు ఇవే
భారత దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. 2020 సంవత్సరం లో భారతదేశం కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో భారతీయ సంస్థలు 12.25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు విదేశాలలో పెట్టాయి. ఇది గత కొన్ని సంవత్సరాలలో చూసిన స్థిరమైన విదేశీ పెట్టుబడులకు అనుగుణంగా ఉంది.
2020-21 లో, సుమారు 13 బిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలు
2020-21 ఆర్థిక సంవత్సరంలో, సుమారు 13 బిలియన్ డాలర్లు భారతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టాయి. ఇది 2013-14 ఆర్థిక సంవత్సరం నుండి వరుసగా రెండంకెల విదేశీ పెట్టుబడుల రెండవ సంవత్సరం అని కేర్ రేటింగ్స్ ఇటీవల విడుదల చేసిన పరిశోధన నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, సింగపూర్, యుఎస్ఎ, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, నెదర్లాండ్స్ మరియు మారిషస్ వంటి చోట్ల భారతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టాయి. ఈ ఐదు దేశాలు మొత్తం పెట్టుబడిలో దాదాపు 70 శాతం వాటా కలిగి ఉన్నాయి.
విదేశీ పట్టుబడులలో టాప్ 5 కంపినీలు ఇవే
నివేదిక ప్రకారం, జెఎస్డబ్ల్యు స్టీల్, ఒఎన్జిసి విదేష్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, హల్దియా పెట్రోకెమికల్స్, మరియు మహీంద్రా & మహీంద్రా 500 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వ్యక్తిగత పెట్టుబడితో మొదటి ఐదు స్థానాలలో ఉన్న పెట్టుబడిదారులు కాగా అదానీ ప్రాపర్టీస్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, లుపిన్, కాడిలా హెల్త్కేర్, టాటా స్టీల్ మరియు ఇన్ఫోసిస్ ఆ తర్వాత స్థానాల్లో నిలిచిన పెట్టుబడిదారులుగా ఉన్నాయి. అలాగే, 11 సంస్థలు, ఒక్కొక్కటి 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ ఎనిమిది నెలల కాలంలో 6.18 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇది మొత్తం పెట్టుబడిలో సగానికి పైగా ఉంది.
ఎక్కువ నిధులను ఆకర్షించే నాలుగు ముఖ్య రంగాలు ఇవే
కంపెనీలు ఎక్కువగా నాలుగు ముఖ్య రంగాలలో పెట్టుబడులు పెట్టాయి . భీమా, ఆర్థిక మరియు వ్యాపార సేవలు; తయారీ, వ్యవసాయం మరియు మైనింగ్; టోకు, రిటైల్ వ్యాపారం, రెస్టారెంట్లు మరియు హోటళ్ళు, అని నివేదిక తెలిపింది. ఈ నాలుగు రంగాలు మొత్తం విదేశీ పెట్టుబడులలో దాదాపు 90 శాతం వాటా కలిగి ఉన్నాయి. వ్యవసాయం మరియు మైనింగ్ మాత్రమే ₹ 100 కోట్లకు పైగా ప్రతిపాదనలను నమోదు చేసిన ఇతర రంగంగా ఉంది .
భారతీయ పెట్టుబడుల అంతర్జాతీయీకరణ ధోరణి
భారతీయ పెట్టుబడుల అంతర్జాతీయీకరణ వైపు ధోరణి పెరిగిందని, రాబోయే సంవత్సరాల్లో సంస్థలు విదేశీ మార్కెట్లలో అవకాశాల కోసం వెతుకుతున్నాయని నివేదిక పేర్కొంది. విదేశీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వ్యాపార ఆదాయాన్ని విస్తృతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా దేశీయ ప్రయత్నాలను పూర్తి చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ కంపెనీలకు స్థానం దక్కుతుంది.