World Bank: ప్రతి దేశానికీ రుణాలు అవసరమే. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతరత్రా కార్యకలాపాలకు వీటిని వినియోగిస్తుంటాయి. అయితే అంతర్జాతీయ స్థాయిలో రుణాలు అానగానే ఎక్కువగా వినిపించే పేర్లు ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలు. సాధారణంగా ఓ దేశం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటుంది అంటే అది అభివృద్ధి చెందుతోందని, అదే IMF సాయం అర్థిస్తోంది అంటే దివాళా అంచున నిలబడింది అని అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇండియాకు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది.

రెండు భాగాలుగా మొత్తం రుణం:
దేశంలో వైద్య రంగం అభివృద్ధి కోసం రూ.500 మిలియన్ డాలర్ల చొప్పున రెండు రుణాలు విషయమై.. ప్రపంచ బ్యాంకు, ఇండియా సంతకం చేశాయి. అక్టోబర్ 2021లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కోసం ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు వరల్డ్ బ్యాంకు తెలిపింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాలను అభివృద్ధి చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ రాష్ట్రాలకు ప్రత్యేకం:
ఈ రెండు రుణాల్లో ఒకదాని ద్వారా యావత్ దేశంతో పాటు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, కేరళ, ఒరిస్సా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లకు ప్రత్యేక సాయం అందించనున్నట్లు ప్రపంచ బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో వైద్య సదుపాయాల కల్పన కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు చెప్పింది. భారత ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ అడిషనల్ సెక్రటరీ రజిత్ కుమార్, వరల్డ్ బ్యాంక్ తరఫున అగస్టే టానో కౌమే సంతకాలు చేశారు.

భవిష్యత్ సన్నద్ధతకు:
కరోనా సంక్షోభం అనంతరం వైద్య సదుపాయాల అవసరం గురించి ప్రపంచ దేశాల్లో తీవ్రంగా చర్చ మొదలైనట్లు కౌమే తెలిపారు. ఈ తరహా మహమ్మారులను ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై ప్రతి దేశమూ ఆలోచిస్తున్నాయి. అందుకే భవిష్యత్తులో రానున్న వైద్య సంక్షోభాలకు వ్యతిరేకంగా, సమర్థవంతంగా పనిచేయడానికి సిద్ధపడుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు సంతకాలు జరిగిన రెండు ప్రాజెక్టులూ భారత్ సన్నద్ధత కోసం ఉద్దేశించినవేనని స్పష్టం చేశారు.

భారీగా పెరిగిన ఆయుర్ధాయం:
భారత ప్రభుత్వానికి ఇస్తున్న ఈ నిధుల ద్వారా ఆయా రాష్ట్రాలు తమ వైద్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచుకోగలవని విశ్వసిస్తున్నట్లు వరల్డ్ బ్యాంకు ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగంలో ఇండియా అంచలంచెలుగా వృద్ది సాధిస్తున్నట్లు గుర్తించామన్నారు. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 1990లో 58 ఏళ్లుగా ఉన్న దేశ ప్రజల ఆయుర్దాయం, 2020 నాటికి 69.8 కి పెరిగినట్లు వెల్లడించారు. దేశ సగటు ఆదాయ స్థాయి కంటే ఇది ఎక్కువగా ఉండటం గమనార్హం.
More From GoodReturns

Amaravati: అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు! ఖాతాలో పడ్డ రూ. 2,800 కోట్లు.. నెక్స్ట్ ప్లాన్ ఇదే!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications