Wipro: సాధారణంగా యువ టెక్కీలు తమకు పనిచేసేందుకు తగిన టాలెంట్ ఉంది కాబట్టి కార్పొరేట్ కంపెనీలు తమను తప్పక ఎంపిక చేసుకుంటాయని భావిస్తుంటారు. ఇలా కొంత మంది తలబిరుసుతోనూ ఉంటుంటారు. అయితే ఇలాంటి అపోహలు పక్కన పెట్టాల్సిందేనని కంపెనీ యాజమాన్యాలను చూస్తే అర్ధమౌతుంది.

రిషద్ ప్రేమ్జీ..
అజిమ్ ప్రేమ్జీ తర్వాత విప్రో కంపెనీ పగ్గాలను చేపట్టారు రిషద్ ప్రేమ్జీ తీసుకున్నారు. ఆయన వచ్చిన తర్వాత విప్రోలో నిర్ణయాలు చాలా వేగంగా, అత్యంత స్పష్టంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన నాస్కామ్ టెక్నాలజీ & లీడర్షిప్ ఫోరమ్ 2023లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తాను ఫాలో అయ్యే రిక్రూట్మెంట్ సూత్రం గురించి ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

నియామకం ఆలోచన..
ప్రేమ్జీ తన టెక్ కంపెనీని వైవిధ్యంగా, అందరినీ కలుపుకొని పోయేలా ఎలా పని చేస్తున్నారో అడిగినప్పుడు.. తన బోర్డు సభ్యుల్లో ఒకరితో మాట్లాడిన తర్వాత రిక్రూట్మెంట్ పట్ల తన అభిప్రాయం మారిందని తెలిపారు. తన ఆలోచనలను సవాలు చేయగల, కొత్త దృక్కోణాలను తీసుకురాగల అభ్యర్థి కోసం వెతుకుతున్నానని ఆయన వెల్లడించారు. తద్వారా విప్రోను వైవిధ్యంగా మార్చినట్లు తెలిపారు.

సంబంధాలు..
ఆఫీసులో వ్యక్తుల మధ్య సంబంధాలు చాలా ముఖ్యమైనవని ప్రేమ్జీ నొక్కిచెప్పారు. కంపెనీలో సంస్కృతిని నిర్మించడం ప్రయాణం కాదని.. గమ్యమని విప్రో చైర్మన్ వెల్లడించారు. ప్రస్తుతం ఫ్రెషర్లు చేరినందున కొత్త వ్యక్తులతో వర్చువల్గా సంబంధాన్ని పెంచుకోవడం కష్టమని ఆయన అన్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. అది వ్యక్తిగతంగా నిర్మించుకోగల సంబంధాలకు సహాయపడదని అభిప్రాయపడ్డారు.

ఆఫీసు నుంచి పని..
భవిష్యత్తు హైబ్రిడ్ వర్క్ కల్చర్ అయినప్పటికీ తాను మాత్రం ఆఫీసుల నుంచి పని చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తానని ఈ వ్యాపారవేత్త వెల్లడించారు. కరోనా సమయంలో ఎలాంటి ఎజెండా లేకుండా ఉద్యోగుల మాటలు వినేందుకు ఒక కంపెనీ బాస్ చేసిన ప్రయత్నాన్ని ఆయన కొనియాడారు. తాను కూడా వారంలో 15 నిమిషాల పాటు ఎజెండా లేకుండా మాట్లాడాలని తాను కూడా అనుకుంటున్నానని వెల్లడించారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications