కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022 నాటికి సాధారణ పరిస్థితికి రావొచ్చునని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అన్నారు. కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ పేద దేశాలకు అందుబాటులోకి రావడం, వ్యాక్సీన్ తక్కువ ధరకు వచ్చేలా చూడటం అవసరం. కరోనా పరిశోధనల కోసం ఇప్పటికే భారీ విరాళం ఇచ్చిన బిల్ గేట్స్ తాజాగా మరింత ప్రకటించారు. మరో 250 మిలియన్ డాలర్ల మొత్తాన్ని ఇస్తున్నట్లు గురువారం బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ తెలిపింది. కరోనాపై పోరు కోసం పరిశోధనలు చేసేందుకు 1.75 బిలియన్ డాలర్ల మేర అందించారు.

అందరికీ వ్యాక్సీన్
తాజాగా 250 మిలియన్ డాలర్లు ఇచ్చారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడారు. 2022లో ప్రపంచం సాధారణ స్థితికి రావొచ్చునన్నారు. అందరికీ కరోనా వ్యాక్సీన్ అందించేందుకు, పేద దేశాలకు సరసమైన ధరలకు ఇచ్చేందుకు తద్వారా ప్రపంచం తిరిగి సాధారణ పరిస్థితికి వచ్చేందుకు వ్యాక్సీన్ అలయెన్స్ కోవాగ్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బిల్ గేట్స్కు జీవనకాల సాఫల్య అవార్డు
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్కు టై-గ్లోబల్ జీవితకాల సాఫల్య అవార్డు లభించింది. టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్ వ్యవస్థ, ప్రపంచానికి ఆయన అందించిన సేవలకు గాను గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, వ్యాపార, పోటీ వ్యూహాలతో బిల్ గేట్స్ ప్రపంచ అతిపెద్ద సాఫ్టువేర్ వ్యవస్థను స్థాపించారు. భారత ఐటీ పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తుగా ఎఫ్సీ కోహ్లీకి లైఫ్ టైమ్ సర్వీస్ టు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అవార్డును ప్రకటించారు. ఆయన మరణానంతరం ప్రకటించడంతో కోహ్లీ తరఫున భార్య స్వీకరించారు.మరిన్ని విభాగాల్లోను టై-గ్లోబల్ అవార్డు ఇచ్చింది.

బిల్గేట్స్ ఏమన్నారంటే
ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడంలో, అధికోత్పత్తి సాధనలో, కరోనాను అరికట్టడంలో పరిశోధన కీలకమన్నారు. ప్రపంచాన్ని వణికించే జబ్బుల నుండి రక్షణ మార్గాలు పరిశోధనల ద్వారానే లభిస్తాయన్నారు. క్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి ఇన్నోవేషన్ కీలకమని, మైక్రోసాఫ్ట్ను ప్రారంభించే సమయంలో తాను, తన భాగస్వామి దీనినే విశ్వసించామన్నారు. క్రియేటివిటీ మెరుగైన సమాజాన్ని నిర్మిస్తుందని చెప్పారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications