ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలు ఉన్నాయని, అవసరాన్ని బట్టి వాటిని ప్రయోగిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆయన గురువారం ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన వెబినార్ మీటింగ్లో మాట్లాడారు. కరోనా సహాయక చర్యలను నిలిపివేసేందుకు ఆర్బీఐకి ఎలాంటి ఆతృత లేదన్నారు. రెపో రేటును యథాతథంగా ఉన్నంత మాత్రాన అస్త్రాలు అయిపోయాయని అనుకోవద్దని, గత పరపతి సమీక్షలో అలాగే ఉంచడం కూడా వాటిని సిద్ధం చేసుకోవడానికేనని తెలిపారు.

రెండుసార్లు ఆర్బీఐ వడ్డీ కోత.. ఇక ఏం చేయగలదంటే..
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికే రెండుసార్లు వడ్డీ రేట్లలో కోతలు విధించిందని, ఇక ఏం చేయగలదని అడిగిన ప్రశ్నకు శక్తికాంత దాస్ సమాధానం చెప్పారు. ఆర్బీఐ వద్ద మరిన్నిఅస్త్రాలు ఉన్నాయని, గత సమీక్షలో వడ్డీ రేట్లు అలాగే ఉంచినంత మాత్రాన అవకాశాలు లేవని భావించవద్దని, అవసరమైన సమయంలో అస్త్రాలు బయటకు తీస్తామన్నారు. కీలక వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో రణ వ్యయాలు తగ్గాయన్నారు. ద్రవ్యోల్భణం పెరిగేంత వరకు వడ్డీ రేట్ల కోత చేశామని, ఇప్పటికీ సర్దుబాట ధోరణిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అలా భవిష్యత్తులో రేట్ల కోతకు అవకాశాలు ఉంచుకున్నట్లు చెప్పారు. తద్వారా అవసరమైతే భవిష్యత్తులో మరింత వడ్డీ రేటు కోత ఉంటుందని భావిస్తున్నారు.

మార్కెట్ను ఆశ్చర్యపరిచే నిర్ణయాలు
కరోనా అనంతరం వృద్ధి, ద్రవ్యోల్భణం అంచనాలను చెప్పగలమన్నారు. వృద్ధి అంటే మన దేశ అంశాలతో పాటు అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా అస్థిర పరిస్థితుల్లో ఉందని, స్పష్టత వచ్చాక చెప్పవచ్చునన్నారు. ఇప్పుడు ఏదో రకంగా సంఖ్య, ఇచ్చేసి సవరించడం సరికాదన్నారు. ఆర్బీఐ ఎప్పుడూ అంచనాక అందని విధంగా ఉండి, మార్కెట్ను ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. తాము ఏ సమాచారాన్ని దాచడం లేదని స్పష్టం చేశారు.

ఆర్థికరంగం బలంగా ఉంది
2009-10లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కంటే కరోనా ప్రభావం మన దేశ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా ఉందన్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక రంగం బలంగా ఉందని చెప్పారు. జీడీపీలో రుణనిష్పత్తి మెరుగుపడడం, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం స్థూలంగా అదుపులోనే ఉండడం, కరెంట్ అకౌంట్ లోటు మెరుగ్గా ఉన్నాయని గుర్తు చేశారు. మున్ముందు కూడా ఆర్థిక రంగం స్థిరంగానే ఉంటుందన్నారు. బ్యాంకింగ్ రంగంలో మాత్రం మరిన్ని సంస్కరణలు అసరమని చెప్పారు.

కేంద్రం తీరు భేష్
కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీరు ప్రశంసనీయంగా ఉందని శక్తికాంత దాస్ అన్నారు. తాను ప్రభుత్వం వైపు మాట్లాడటం కాదని, ఆర్బీఐలో ఉన్నందున... ఓ పరిశీలకుడిగా ప్రభుత్వ చర్యలు చాలా వివేకవంతమైనవిగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు స్థిరీకరణ వ్యూహం కూడా ఆహ్వానించదగ్గది అన్నారు. ఎక్కువ బ్యాలెన్స్ షీట్లు ఉన్న బ్యాంకులు ప్రజలకు మేలు చేస్తాయన్నారు. అప్పుడే అంతర్జాతీయ బ్యాంకులతో పోటీ పడతాయన్నారు. బ్యాంకుల విలీన వ్యూహం కూడా హర్షణీయమన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications