Vijay Mallya: పాపం విజయ్ మాల్యా.. రూ.2000 వేలు జరిమానా.. నాలుగు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు..
Vijay Mallya: యునైటెడ్ కింగ్డమ్కు పారిపోయిన విజయ్ మాల్యా గైర్హాజరుపై ఈ రోజు విచారణ జరిగింది. 2017లో కోర్టు ధిక్కరణ కేసులో పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు ఈరోజు నాలుగు నెలల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేయడంపై 2017లో ధిక్కార నేరానికి పాల్పడ్డారు.
జరిమానాను నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని, లేని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. విజయ్ మాల్యా ఇప్పుడు పనికిరాని తన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు సంబంధించిన రూ.9,000 కోట్లకు పైగా బ్యాంక్ లోన్ డిఫాల్ట్ కేసులో నిందితుడిగా ఉన్నారు.
డబ్బు
రికవరీకి
ఆదేశం..
విజయ్
మాల్యా
తన
పిల్లలకు
చేసిన
40
మిలియన్
డాలర్ల
లావాదేవీ
"శూన్యం,
పనికిరానిది"
అని
దేశ
అత్యున్నత
న్యాయస్థానం
పేర్కొంది.
మాల్యా
పిల్లలు
ఆ
మొత్తాన్ని
8%
వడ్డీతో
నాలుగు
వారాల్లోగా
రికవరీ
అధికారికి
తిరిగి
ఇవ్వాలని
ఆదేశించింది.
ఒకవేళ
ఆ
మొత్తాన్ని
తిరిగి
ఇవ్వకపోతే
విజయ్
మాల్యా
ఆస్తులను
అటాచ్
చేసుకోవచ్చు.
భారత
ప్రభుత్వం,
అన్ని
ఏజెన్సీలు
ఈ
ప్రక్రియలో
సహాయం
చేయాలని
కోర్టు
ఆర్డర్
పేర్కొంది.న్యాయమూర్తులు
యుయు
లలిత్,
ఎస్
రవీంద్ర
భట్,
పిఎస్
నరసింహలతో
కూడిన
ధర్మాసనం
ఈ
మేరకు
ఉత్తర్వులు
జారీ
చేసింది.
మాల్యాను
భారత్
కు
తిరిగి
తీసుకొస్తారా..?
కర్నాటక
హైకోర్టు
ఇచ్చిన
ఆదేశాలను
ఉల్లంఘిస్తూ
విజయ్
మాల్యా
వాస్తవాలను
దాచిపెట్టి
డబ్బును
తన
కుమారుడు
సిద్ధార్థ్
మాల్యా,
కుమార్తెలు
లీనా
మాల్యా,
తాన్యా
మాల్యాలకు
మళ్లించారని
బ్యాంకులు
ఆరోపించాయి.
బ్రిటన్
నుంచి
విజయ్
మాల్యాను
రప్పించేందుకు
అనుమతించినప్పటికీ,
అక్కడ
అతనిపై
పెండింగ్లో
ఉన్న
కొన్ని
'రహస్య'
విచారణల
దృష్ట్యా
ఆయనను
భారత్కు
తీసుకురావడం
సాధ్యం
కాదని,
వాటి
వివరాలు
కేంద్రానికి
తెలియవని
కేంద్రం
గతంలో
కోర్టుకు
తెలియజేసింది.