Railway News: కొన్నిసార్లు సాధారణ కేసుల పరిష్కారానికి కూడాా సంవత్సరాలు పట్టవచ్చు. అచ్చం అలాంటిదే ఇక్కడ చోటుచేసుకుంది. తనకు న్యాయం కావాలంటూ ఒక వ్యక్తి 22 ఏళ్లుగా భారతీయ రైల్వేపై న్యాయస్థానంలో పోరాడుతున్నాడనే వార్త మిమ్మల్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేయవచ్చు. అయితే ఇక్కడ అంతిమ విజయం అతనికే దక్కింది. కొన్ని సమయం పడుతుంది కానీ విజయం తనకే దక్కుతుందని సదరు వ్యక్తి చేసిన ప్రయత్నం ఫలిచింది. రెండు దశాబ్దాల పోరాటం తరువాత న్యాయం అతడినే వరించింది.

రైల్వేతో గొడవ ఏంటి..?
ఉత్తరప్రదేశ్కు చెందిన తుంగనాథ్ చతుర్వేది అనే వ్యక్తి 22 ఏళ్లు భారతీయ రైల్వేలపై న్యాయం కోసం పోరాడాడు. ఇతను ఒక న్యాయవాది. 1999లో రైలులో ప్రయాణించటానికి ఆయన రెండు టిక్కెట్లను కొన్నారు. అయితే వాటిపై రూ.20 అదనంగా వసూసలు చేశారు. ఈ ఘటన ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని మధుర కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. దీనిపై ఆయన న్యాయం కావాలంటూ కోర్టును ఆశ్రయించారు.

తాజాగా కోర్టు తీర్పు..
ఈ వ్యవహారంలో వినియోగదారుల న్యాయస్థానం గత వారం చతుర్వేదికి అనుకూలంగా తీర్పునిచ్చింది. వడ్డీతో సహా మొత్తాన్ని తిరిగి చెల్లించాలని రైల్వేకి సూచించింది. ఈ కేసుకు సంబంధించి ఆయన దాదాపుగా 100 కంటే ఎక్కువ సార్లు విచరాణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు 66 సంవత్సరాలు కావటం గమనార్హం.

టిక్కెట్ బుకింగ్ క్లర్క్..
ఉత్తరప్రదేశ్లో నివసిస్తున్న చతుర్వేది మథుర నుంచి మొరాదాబాద్కు ప్రయాణిస్తుండగా.. టిక్కెట్ బుకింగ్ క్లర్క్ అతను కొనుగోలు చేసిన రెండు టిక్కెట్ల కోసం రూ.20 ఎక్కువ ఛార్జీ విధించాడు. దీంతో బుకింగ్ క్లర్క్పై మధురలోని వినియోగదారుల కోర్టులో కేసు వేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ కేసును కొట్టివేయాలని సమస్య పరిష్కారానికి రైల్వే ట్రిబ్యునల్కు వెళ్లాలని రైల్వే వాధించింది. 2021 సుప్రీం కోర్ట్ తీర్పును వినియోగదారుల కోర్టులో విచారించవచ్చని నిరూపించడానికి చతుర్వేది ఉపయోగించటంతో కేసు విచారణ వేగం పుంజుకుంది.

రైల్వేపై జరిమానా..
సుదీర్ఘ పోరాటం తర్వాత.. ఈ కేసులో బాధితుడైన చతుర్వేదికి రూ.15,000 చెల్లించాలని కోర్టు రైల్వేని ఆదేశించింది. 1999 నుంచి 2022 వరకు అతనికి సంవత్సరానికి రూ.20పై 12% లెక్కించి మెుత్తాన్ని తిరిగి చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఈ మెుత్తాన్ని 30 రోజుల్లో అందించాలని లేకుంటే చెల్లించాల్సిన వడ్డీ రేటును 15 శాతానికి పెంచుతామని హెచ్చరించింది. అయితే ఇక్కడ తనకు డబ్బు ముఖ్యంకాదని, తాను న్యాయవాదిని కాబట్టి తాను న్యాయం కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగించానని చతుర్వేది వెల్లడించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications