న్యూఢిల్లీ: ఈ రెండు నెలల కాలానికి వేల కోట్ల రూపాయల మేర రుణాలను తీసుకోబోతోన్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫిబ్రవరి, మార్చినెలల్లో ఆర్థిక లక్ష్యాను అందుకోవడానికి భారీగా అప్పులను తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒక్కో నెలకు 40 వేల కోట్ల రూపాయల చొప్పున రుణాలను తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని అన్నారు. మొత్తంగా 80 వేల కోట్ల రూపాయల అప్పులు చేయబోతోన్నామని స్పష్టం చేశారు.
2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్లో ప్రవేశపెడుతోన్న సందర్భంగా ఆమె ఈ ప్రకటన చేశారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో నెలకు లక్ష కోట్ల రూపాయల చొప్పున రుణాలను తీసుకోవాలని నిర్ణయించామని అన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్ ఆమోదించిందని చెప్పారు. కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం ఈ ప్రతిపాదనలను బడ్జెట్లో చేర్చామని తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి నాటికి అంటే.. 12 నెలల కాలానికి నెలకు లక్ష కోట్లు చొప్పున 12 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ ఏడాది కాలానికి 34.83 లక్షల కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని అంచనా వేశామని అన్నారు. ఇందులో 5.54 లక్షల కోట్ల రూపాయల మేర స్థూల పెట్టుబడుల కేటాయింపులు ఉన్నాయని ఆమె వివరించారు.
వ్యయానికి అనుగుణంగా రాబడి లేకపోవడం వల్లే రుణాలను తీసుకోదలిచామని తెలిపారు. దీనికి అనుగుణంగా తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని పేర్కొన్నారు. స్థూల జాతీయోత్పత్తిలో 9.5 శాతం లోటు నెలకొందని, దీన్ని అందుకోవడానికి రుణాలను తీసుకోవడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తిలో ఈ ద్రవ్యలోటు 6.8 శాతంగా నమోదవుతుందని అంచనా వేస్తున్నామని అన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications