Bank news: మార్చితో ముగిసిన త్రైమాసికంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి లాభాలను ఆర్జించింది. స్టాండ్ అలోన్ నికర లాభంలో 93.27 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు ఇదే త్రైమాసికంలోని 1,440 కోట్లతో పోలిస్తే ఈసారి 2,782 కోట్లను సాధించింది. నికర వడ్డీ ఆదాయం (NII) 8 వేల 251 కోట్లుగా వెల్లడించింది. అంటే 21.88 శాతం వృద్ధిని ఉందన్నమాట.
మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ. 3 చొప్పున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డివిడెండ్ ప్రకటించారు. తేలికైన నిధుల మూలంగా భావించే CASA డిపాజిట్లు గతేడాదితో పోలిస్తే 4.47 శాతం పెరిగినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో బ్యాంకు వెల్లడించింది. మొత్తం డిపాజిట్లను చూస్తే గత ఆర్థిక సంవత్సరం చివరి రోజు నాటికి 11 లక్షల 17 వేల 716 కోట్లని పేర్కొంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తుల నాణ్యతలో కూడా మెరుగుదలని నివేదించింది. స్థూల NPA అడ్వాన్సులు YoY 358 మేరకు తగ్గి 7.53 శాతానికి, నికర NPAలు 198 bps తగ్గి 1.70 శాతానికి చేరాయి. స్థూల అడ్వాన్స్లు 13.05 శాతం, మొత్తం డిపాజిట్లు 8.26 శాతం వృద్ధి సాధించాయి. తద్వారా మొత్తం వ్యాపారం YoY 10.23 శాతం పెరిగిందని బ్యాంక్ పేర్కొంది. మార్చి 31, 2023 నాటికి బ్యాంకు మొత్తం వ్యాపారం విలువ 19 లక్షల 27 వేల 621 కోట్లన్నమాట.
FY23 మాదిరిగానే మార్చి 2024కి అడ్వాన్స్ లలో 10-12 శాతం వృద్ధి సాధించాలని బ్యాంకు నిర్దేశించుకుంది. డిపాజిట్ లనూ 8-10 మేర పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది మునుపటి టార్గెట్ కంటే తక్కువ కావడం గమనార్హం. నికర వడ్డీ మార్జిన్ కు సంబంధించిన మార్గదర్శకాన్ని మాత్రం స్థిరంగా 3 శాతం వద్దే ఉంచింది. కానీ స్థూల NPAని 6 శాతం కంటే దిగువకు తీసుకురావాలని యోచిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications