21 రోజుల్లో రూ.5446 కోట్ల చెల్లించండి: 3 చైనా బ్యాంకుల రుణంపై అనిల్ అంబానీకి కోర్టు ఆదేశం
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని అప్పులు వెంటాడుతున్నాయి. చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 717 మిలియన్ డాలర్లు అంటే రూ.5446 కోట్ల రుణానికి సంబంధించి అనిల్ అంబానీ పూచీ ఉన్నారు.2012 ఫిబ్రవరిలో ఆర్ కామ్ తీసుకున్న లోన్కు అనిల్ అంబానీ గ్యారంటీగా ఉన్నారు. కానీ ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో నడుస్తుండటంతో.. తాము ఇచ్చిన రుణం తిరిగి చెల్లించాలని బ్యాంకులు కోర్టును ఆశ్రయించారు.
అప్పులు తీర్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థల్ని విక్రయిస్తున్న అనిల్ అంబానీ
కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల పిటిషన్ను లండన్ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. పిటిషనర్ రుణాలపై వాదనలు విన్న ధర్మాసనం.. అనిల్ అంబానీని రుణ మొత్తం చెల్లించాలని జస్టిస్ నిగెల్ ఆదేశించారు. ఇందుకు 21 రోజుల గడువును కూడా విధించింది.
3.2 క్లాజ్ ప్రకారం తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో.. గ్యారంటీ ఉన్న అనిల్ అంబానీ రుణం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రుణం చెల్లించేందుకు అనిల్.. బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై అనిల్ అంబానీ కార్యాలయం హామీ ఇవ్వడానికి అధికారం లేదు అని.. తీసుకున్న రుణం చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు.