సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్దీ సంప్రదాయ శ్రామికశక్తికి నష్టం వాటిల్లుతోంది. ఆటోమేషన్ ఆందోళన కలిగించేస్థాయిలో ఉద్యోగాలను తినేస్తోంది. తాజాగా PwC సర్వేలోను ఇది వెల్లడైంది. కరోనా నేపథ్యంలో అన్ని రంగాల్లోను ఆటోమేషన్ వేగంగా జరుగుతోందని, వచ్చే అయిదేళ్ల కాలంలో తమ ఉద్యోగాలు పోతాయని దాదాపు నలభై శాతం మంది ఆందోళన చెందుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. భారత్ సహా 19 దేశాల్లో ఈ ఏడాది జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరిగిన సర్వేలో 32,500 మంది పాల్గొన్నారు.

ఉద్యోగ భయం
ఆటోమేషన్ కారణంగా తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని 60 శాతం మంది ఆందోళన వ్యక్తం చేసినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 48 శాతం మంది భవిష్యత్తులో సంప్రదాయ ఉద్యోగాలు ఉండవని అభిప్రాయపడ్డారు. 39 శాతం మంది తమ ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో సంస్థలు, పరిశ్రమలు.. మ్యాన్పవర్కు బదులు యంత్రాల వినియోగాన్ని క్రమంగా పెంచుతున్నాయని వెల్లడైంది. ప్రతి ఐదుగురిలో ఇద్దరు వచ్చే అయిదేళ్ల కాలంలో తమ ఉద్యోగాలు పోతాయని ఆందోళనగా ఉన్నారు.

కొత్త నైపుణ్యాలు
లాక్ డౌన్తో తమ డిజిటల్ నైపుణ్యాలు మెరుగయ్యాయని 40 శాతం మంది తెలిపారు. కొత్త నైపుణ్యాలపై దృష్టి సారించినట్లు ఎక్కువమంది తెలిపారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు 77 శాతం మంది, పని ప్రదేశాల్లో కొత్త టెక్నాలజీని స్వీకరించేందుకు 80 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో 69 శాతం మంది, దక్షిణాఫ్రికాలో 66 శాతం మంది ఈ విషయంలో మంచి విశ్వాసంతో ఉన్నారు.
49 శాతం మంది వ్యాపార నైపుణ్యంపై దృష్టి సారించారు. కరోనా తర్వాత సొంత వ్యాపారంపై ఎక్కువ మంది దృష్టి పెట్టారు. పని ప్రదేశంలో ఎదుర్కొంటున్న వివక్ష వలన కెరీర్ పురోగతి, శిక్షణ కోల్పోతున్నట్లు 50 శాతం మంది తెలిపారు. జాతి వివక్ష ఉందని 13 శాతం మంది, లింగ వివక్ష ఉందని 14 శాతం మంది తెలిపారు.

సమాజానికి ఉపయోగపడే సంస్థలో
సమాజానికి సహకరించే సంస్థలో పని చేయాలని 75 శాతం మంది కోరుకుంటున్నారు. ఇది ముఖ్యంగా చైనా (87 శాతం), భారత్ (90 శాతం)లో ఎక్కువగా ఉంది. సౌతాఫ్రికాలోను 90 శాతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. పిల్లలు, కుటుంబం వంటి వివిధ ఆర్థిక కారణాలతో ఉద్యోగులు ఆర్థికంగా ఉండే సంస్థలకు మొగ్గు చూపుతున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications