రూపే కార్డుల్లో డేటా భద్రతను మరింత పదిలం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రకటించింది. అంటే మర్చంట్ల వద్ద కార్డు వివరాలను భద్రపరిచేందుకు ప్రత్యామ్నాయంగా ఈ వ్యవస్థను వినియోగిస్తారు. దీంతో కస్టమర్ల వివరాలకు మరింత గోప్యత, భద్రత ఉంటుంది. అలాగే కొనుగోళ్లు సులభం అవుతాయి. ఎన్క్రిప్టెడ్ రూపంలో కస్టమర్ సమాచారాన్ని టోకెన్ రూపంలో భద్రపరచడంతో ట్రాన్సాక్షన్స్కు భద్రత ఏర్పడుతుంది. కస్టమర్ వివరాలను వెల్లడించకుండానే చెల్లింపు ప్రక్రియకు ఈ టోకెన్లు వీలు కల్పిస్తాయి. NPCI టోకెనైజేషన్ సిస్టం కింద బ్యాంకులు, అగ్రిగేటర్లు, మర్చంట్స్, ఇతరులు NPCI వద్ద ధృవపత్రం పొందితే టోకెన్ రిక్వెస్టర్ పాత్రను పోషించవచ్చు.
రూపే కార్డు వినియోగదారులు భవిష్యత్తులో చేసే ట్రాన్సాక్షన్స్కు ఈ అన్ని వ్యాపార వర్గాలు తమ రూపే కస్టమర్ల టోకెన్ రిఫరెన్స్ ఆన్ఫైల్(TROF)ను వినియోగించుకోవచ్చు. ఈ పారదర్శక వ్యవస్థ కారణంగా కస్టమర్ సమాచారం లీక్ కాదు. చెల్లింపు ప్రక్రియ వేగవంతమవుతుంది. ఈ విధానంలో కస్టమర్కు సంబంధించిన ముఖ్యైన సమాచారం ఎన్క్రిప్టెడ్ టోకెన్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. దీంతో షాపింగ్ చేసిన ప్రతిసారి కస్టమర్ వారి సమాచారం అందించే అవసరం ఉండదు. అలాగే కస్టమర్కు చెందిన కీలక సమాచారం పేమెంట్ ఇంటర్మీడియేటరీలు స్టోర్ చేసే వీలు ఉండదు. NPCI సర్టిఫై చేసిన బ్యాంకులు, అగ్రిగేటర్లు మాత్రమే కార్డులు టోకెన్ రిఫరెన్స్లు సేవ్ చేయడానికి వీలుంటుంది.

రూపే కార్డు భారతదేశంలోనే రూపొందించిన ఎలక్ట్రానిక్ పేమెంట్ కార్డు. ఇది ఏటీఎమ్ కమ్ డెబిట్ కార్డుగా పనిచేస్తుంది. రూపాయి, పేమెంట్ అనే పదాలు కలిసి వచ్చేలా రూపే కార్డు అని పేరు పెట్టారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తున్న ఈ కార్డుతో బిల్లు చెల్లింపులు, ఆన్లైన్ లావాదేవీలు జరపొచ్చు. రూపే కార్డును దేశంలోని అన్ని ఏటీఎమ్ల్లోనూ, వ్యాపార సముదాయాల్లోనూ ఉపయోగించవచ్చు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications