కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీనిని కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ఆదాయం కోల్పోతున్నారు. దీంతో 80 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరేలా కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. గాడితప్పిన ఆర్థిక రంగాన్ని దారిలో పెట్టేందుకు కేంద్రం మరో భారీ ఆర్థిక ప్యాకేజీకి సిద్ధమవుతోందని తెలుస్తోంది.

మరో భారీ ఆర్థిక ప్యాకేజీ
ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం మరో భారీ ఆర్థిక ప్యాకేజీకి సిద్ధమవుతోందట. ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలకమైన సప్లై, డిమాండ్ను సమతౌల్యం చేసేందుకు ఈ ప్యాకేజీని రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్యాకేజీని ఎప్పుడు ప్రకటించాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయట.

అంతకుమించి భారీ ప్యాకేజీ
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల రూ.1,70000 కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. తదుపరి ప్యాకేజీ అంతకంటే భారీగా ఉండనుందని భావిస్తున్నారు. ప్యాకేజీ రూపకల్పన కోసం అన్ని మంత్రిత్వశాఖలతో ఆర్థిక శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ఏ రంగానికి ఎలాంటి ఉద్దీపన అవసరమనే అంశాలపై చర్చిస్తున్నారు.

MSMEలకు పెద్దపీట
కేవలం చిన్న కంపెనీలు, తదితరాలకే రూ.1 లక్ష కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రెండో ప్యాకేజీ ప్రధానంగా MSMEలపై దృష్టి సారించారు. ఇలాంటి వాటికే లక్ష కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా.

దేశ ఆర్థిక వ్యవస్థల నాలుగోవంతు MSMEలది
ప్రభుత్వం అంచనాల ప్రకారం చిన్న వ్యాపారాలు భారతదేశంలోని 2.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో నాలుగో వంతు వాటాను కలిగి ఉన్నాయి. 500 మిలియన్లకు పైగా ఉద్యోగులు లేదా కార్మికులు ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలమంది ఈ వ్యాధి బారిన పడ్డారు. 88వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇండియాలో దాదాపు 6వేల కేసులు నమోదయ్యాయి. 178 మంది మృత్యువాత పడ్డారు. లాక్ డౌన్ కారణంగా మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితి కాస్త అదుపులో ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications