కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీనిని కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ఆదాయం కోల్పోతున్నారు. దీంతో 80 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరేలా కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. గాడితప్పిన ఆర్థిక రంగాన్ని దారిలో పెట్టేందుకు కేంద్రం మరో భారీ ఆర్థిక ప్యాకేజీకి సిద్ధమవుతోందని తెలుస్తోంది.

మరో భారీ ఆర్థిక ప్యాకేజీ
ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం మరో భారీ ఆర్థిక ప్యాకేజీకి సిద్ధమవుతోందట. ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలకమైన సప్లై, డిమాండ్ను సమతౌల్యం చేసేందుకు ఈ ప్యాకేజీని రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్యాకేజీని ఎప్పుడు ప్రకటించాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయట.

అంతకుమించి భారీ ప్యాకేజీ
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల రూ.1,70000 కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. తదుపరి ప్యాకేజీ అంతకంటే భారీగా ఉండనుందని భావిస్తున్నారు. ప్యాకేజీ రూపకల్పన కోసం అన్ని మంత్రిత్వశాఖలతో ఆర్థిక శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ఏ రంగానికి ఎలాంటి ఉద్దీపన అవసరమనే అంశాలపై చర్చిస్తున్నారు.

MSMEలకు పెద్దపీట
కేవలం చిన్న కంపెనీలు, తదితరాలకే రూ.1 లక్ష కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రెండో ప్యాకేజీ ప్రధానంగా MSMEలపై దృష్టి సారించారు. ఇలాంటి వాటికే లక్ష కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా.

దేశ ఆర్థిక వ్యవస్థల నాలుగోవంతు MSMEలది
ప్రభుత్వం అంచనాల ప్రకారం చిన్న వ్యాపారాలు భారతదేశంలోని 2.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో నాలుగో వంతు వాటాను కలిగి ఉన్నాయి. 500 మిలియన్లకు పైగా ఉద్యోగులు లేదా కార్మికులు ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలమంది ఈ వ్యాధి బారిన పడ్డారు. 88వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇండియాలో దాదాపు 6వేల కేసులు నమోదయ్యాయి. 178 మంది మృత్యువాత పడ్డారు. లాక్ డౌన్ కారణంగా మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితి కాస్త అదుపులో ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications