నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థకు వ్యాక్సీన్: ICC
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ప్రవేశ పెట్టే బడ్జెట్ ఆర్థిక వ్యవస్థకు వ్యాక్సీన్గా ఉంటుందని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) శనివారం తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థకు ఇది వ్యాక్సీన్లా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. డిమాండ్ పెంచేందుకు ఆర్థిక ప్యాకేజీ అవసరమని అభిప్రాయపడింది. కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ పెంచడంతో పాటు ప్రజల్లో కొనుగోలు పెంపుకు చర్యలు అవసరమని అభిప్రాయపడింది. ప్రభుత్వ ఖర్చు చాలా కీలకమని పేర్కొంది.
నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. కరోనా నేపథ్యంలో బడ్జెట్ పైన వివిధ రంగాలు, వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. నిర్మలమ్మ నిన్న ఎకనమిక్ సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి
2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ మైనస్ 7.7 శాతంగా నమోదు కావొచ్చునని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 11.5 శాతంగా నమోదు కావొచ్చునని ఆర్థిక సర్వే పేర్కొంది. బడ్జెట్ సమావేశాలు నేడు (జనవరి 29 శుక్రవారం) ప్రారంభమయ్యాయి. తొలుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.