అట్లాస్ సైకిల్స్ చివరి తయారీ యూనిట్ తాత్కాలిక మూసివేత .. ఆర్ధిక కష్టాలే కారణమట!!

భారతదేశంలో సైకిళ్లకు పర్యాయపదంగా మారిన అట్లాస్ సైకిల్స్ - ఫ్యాక్టరీని నడపడానికి నిధుల కొరత ఉందని పేర్కొంటూ, దేశ రాజధాని వెలుపల సాహిబాబాద్‌లో తన చివరి తయారీ యూనిట్‌ను మూసివేసింది. అయితే, కంపెనీ సిఇఒ ఎన్ పి సింగ్ రానా, షట్డౌన్ తాత్కాలికమేనని, మిగులు భూమిని అమ్మడం ద్వారా సుమారు 50 కోట్ల రూపాయలను సమీకరించగలిగిన తర్వాత కంపెనీ తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని పేర్కొన్నారు.

ప్రపంచ సైకిల్ దినోత్సవం నాడే తన ప్లాంట్ మూసేసిన అట్లాస్ సైకిల్స్

ప్రపంచ సైకిల్ దినోత్సవం నాడే తన ప్లాంట్ మూసేసిన అట్లాస్ సైకిల్స్

జూన్ 3 న కంపెనీ కర్మాగారాన్ని మూసివేసింది. ఇది ప్రపంచ సైకిల్ దినోత్సవం నాడే తన ప్లాంట్ మూసివేయ్యటం గమనించాల్సిన అంశం . అట్లాస్ తమ సాహిబాబాద్ యూనిట్ లో పని చేస్తున్న 431 మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించింది. అయినప్పటికీ వారు సంస్థ యొక్క జాబితాలో కొనసాగాలని రానా నొక్కిచెప్పారు మరియు రోజువారీ హాజరును గుర్తించిన తరువాత "లే-ఆఫ్ వేతనాలు" చెల్లించబడతాయని పేర్కొన్నారు .

నోటీసు కూడా లేకుండా ప్లాంట్ మోసేశారని కార్మికుల ఆవేదన

నోటీసు కూడా లేకుండా ప్లాంట్ మోసేశారని కార్మికుల ఆవేదన

దేశంలో అట్లాస్ సైకిల్ సంస్థకు సంబంధించిన అతిపెద్ద ప్లాంట్ 1989 లో ప్రారంభమైంది. ఇది నెలవారీ రెండు లక్షల సైకిళ్ల ఉత్పత్తితో ఒకానొక సమయంలో దూసుకుపోయింది. అట్లాస్ సంస్థ యొక్క చివరి కార్యాచరణ ప్లాంట్ ఇది . ఇది కూడా మూత పడటంతో సంస్థలో పని చేసే కార్మికులు ఆందోళనలో ఉన్నారు. నోటీసు లేకుండా యూనిట్ మూసివేయబడిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇక ఫ్యాక్టరీ మూసివేతకు సంబంధించి బుధవారం, ఫ్యాక్టరీ గేట్లపై ఒక నోటీసు అతికించబడింది.

ఆర్ధిక ఇబ్బందులతో తాత్కాలికంగా మూసివేస్తున్నామని గేటుకు నోటీసు అంటించిన సంస్థ

ఆర్ధిక ఇబ్బందులతో తాత్కాలికంగా మూసివేస్తున్నామని గేటుకు నోటీసు అంటించిన సంస్థ

ఇక ఆ నోటీసులో "కంపెనీ చాలా సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభంలో ఉంది మరియు ఫ్యాక్టరీని నష్టాల నుండి బయటకు తీసుకురావటానికి ఉన్న నిధులన్నీ అయిపోయాయి. మా రోజువారీ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మేము ముడి పదార్థాలను కూడా కొనలేకపోతున్నాము. ఈ పరిస్థితులలో, నిర్వహణ భారం కావటంతో కర్మాగారాన్ని నిర్వహించే స్థితిలో లేదు."అందుకే మూసివేస్తున్నామని నోటీసులో పేర్కొన్నారు .

నష్టాల ఊబిలో సంస్థ .. కరోనాతో నిండా మునిగిన అట్లాస్

నష్టాల ఊబిలో సంస్థ .. కరోనాతో నిండా మునిగిన అట్లాస్

అట్లాస్ సైకిల్ సంస్థ 2014 లో నష్టాలను ప్రారంభించింది . మలన్పూర్ లో అట్లాస్ మొదటి ప్లాంట్ 2014 డిసెంబరులో మూసివేసింది. నష్టాలు అప్పటి నుండి కొనసాగుతూనే ఉన్నాయి.ఇక ఆ తర్వాత హర్యానాలోని సోనెపట్ లో దాని రెండవ ప్లాంట్ కూడా ఫిబ్రవరి 2018 లో మూసివేసింది . సోనెపట్ ప్లాంట్ 1951 లో జంకిదాస్ కపూర్ చేత స్థాపించబడిన మొదటి యూనిట్. 2014 నుండి ఇది ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం గత ఒకటిన్నర సంవత్సరాలలో మరింత అధ్వాన్నంగా మారింది . ఇక కరోనావైరస్ లాక్డౌన్ దానిని మరింత కష్టాలలోకి నెట్టింది.

భారదేశంలో వృద్ధి నుండి క్షీణ దశకు చేరుకున్న అట్లాస్

భారదేశంలో వృద్ధి నుండి క్షీణ దశకు చేరుకున్న అట్లాస్

సోనెపాట్ వద్ద చిన్న టిన్ షెడ్ నుండి ప్రారంభించి, అట్లాస్ సైకిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కేవలం 12 నెలల్లో 25 ఎకరాల ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించింది. అప్పట్లో అంతగా వృద్ధి సాధించిన అట్లాస్ ఇది త్వరలోనే భారతదేశపు అతిపెద్ద సైకిల్ తయారీదారుగా మారింది . 1982 లో దేశ రాజధానిలో జరిగిన ఆసియా క్రీడలకు సైకిళ్ల అధికారిక సరఫరాదారుగా ప్రఖ్యాతి గాంచింది.ఇక తాజాగా ఆర్థిక పరిమితుల కారణంగా తయారీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే స్థితిలో సంస్థ యొక్క సాహిబాబాద్ యూనిట్ లేదని జూన్ 2 న కంపెనీ తెలిపింది. అందువల్ల, సంస్థ యొక్క సాహిబాబాద్ యూనిట్ యొక్క శ్రామిక శక్తి జూన్ 3, 2020 నుండి, నిధుల యొక్క తగినంత ఏర్పాట్లు చేసే వరకు తొలగించబడుతుంది "అని అట్లాస్ సైకిల్స్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+