హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అయిదేళ్ల తరువాత తొలిసారిగా అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. వారం రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన పలు సదస్సులు, సమ్మిట్లకు హాజరు కానున్నారు. తాను అమెరికాకు బయలుదేరి వెళ్లినట్లు ఓ ట్వీట్ చేశారు కేటీఆర్. వచ్చేవారం అంతా పలు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్లో ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. హైదరాబాద్ను కేంద్ర బిందువుగా చేసుకుని దక్షిణాది రాష్ట్రాల్లో తమ లావాదేవీలను నిర్వహిస్తోన్నాయి. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐకియా వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ను తమ ప్రధాన కేంద్రంగా చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్ ప్రధాన ఐటీ హబ్గా ఆవిర్భవించింది.

మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా కేటీఆర్.. తాజాగా అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయడానికి ఈ పర్యటనను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చేవారం పలు బిజినెస్ కాన్ఫరెన్స్లల్లో ఆయన పాల్గొనబోతోన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న పారిశ్రామిక విధానాలను ఈ సమ్మిట్ల ద్వారా పెట్టుబడిదారులకు వివరించనున్నారు.
కొత్తగా ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి పథకానికి ఎన్ఆర్ఐల నుంచి విరాళాలను సేకరించడానికీ ఈ పర్యటన ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా అక్కడ ఎన్ఆర్ఐలతోనూ సమావేశం కానున్నారు. తమ సొంత గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి విరాళాలను అందజేయాలంటూ కేటీఆర్ ఎన్ఆర్ఐలను విజ్ఞప్తి చేయనున్నారు. తెలుగు అసోసియేషన్లతో భేటీ కానున్నారు.
కోటి రూపాయలకు పైగా విరాళాన్ని అందజేసిన వారి పేరును ప్రభుత్వ పాఠశాలకు పెట్టే అవకాశం ఉన్నందున, ఈ విషయాన్ని కూడా కేటీఆర్ వారికి వివరిస్తారు. అలాగే- 20 లక్షల రూపాయల వరకు విరాళం ఇచ్చిన వారి పేర్లను తరగతి గదుకు పెట్టనున్నారు. వచ్చేవారం ఏర్పాటు కాబోయే సమావేశాలు, సదస్సుల్లో పాల్గొనడానకి ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. అయిదు సంవత్సరాల తరువాత తొలిసారిగా అమెరికా వెళ్తున్నానని చెప్పారు.
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

తెలంగాణ నుంచి తిరుపతికి వేగవంతమైన కనెక్టివిటీ.. నకిరేకల్ - ఏర్పేడు NH-565 పూర్తిగా అందుబాటులోకి..

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

ఇందిరమ్మ ఇళ్లుపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏప్రిల్లో రెండో విడత కార్యక్రమం..

Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications