ఐటీ కంపెనీలు, బీపీవో సంస్థల్లోని ఉద్యోగులు జూలై 31వ తేదీ వరకు ఇళ్ళ నుండి పని చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఐటీ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.

ఐటీ కంపెనీలకు ఊరట
వర్క్ ఫ్రమ్ హోమ్కు కేంద్రం ఇంతకుముందు ఇచ్చిన అనుమతి ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. కరోనా నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ను పొడిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ, బీపీవో కంపెనీల నుండి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో జూలై 31వ తేదీ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగిస్తున్నట్లు రవిశంకర ప్రసాద్ తెలిపారు. తమ ఉద్యోగులను, సిబ్బందిని దశల వారీగా తిరిగి కార్యాలయాలకు రప్పించాలని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. కేంద్రం తాజా నిర్ణయం ఐటీకి ఊరట అని నాస్కామ్ తెలిపింది.

ఈ ఏడాదంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి..
వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అశ్వథ్ నారాయణ మాట్లాడుతూ... వర్క్ ఫ్రమ్ హోమ్ను మార్చి 31, 2021 వరకు అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఇవ్వాలని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ను కోరారు. దీనికి రవిశంకర ప్రసాద్ స్పందిస్తూ.. జూలై చివరలో దీని గురించి ఆలోచిద్దామన్నారు.

ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్
వర్క్ ఫ్రమ్ హోమ్ దృష్ట్యా భారత్ నెట్ కింద ఇంటర్నెట్ సర్వీస్ మరింత బలపరుస్తామని రవిశంకర ప్రసాద్ చెప్పారు. దాదాపు 80 శాతం నుండి 90 శాతం ఐటీ కంపెనీలు ఇంటి వద్ద నుండి పని చేస్తున్నాయి. కాగా, అంతకుముందు మార్చి నెలలో ఏప్రిల్ 30వ తేదీ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్కు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు దీనిని పొడిగించింది.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications