ముంబై: సాఫ్ట్వేర్ జెయింట్ టెక్ మహీంద్ర తన పరిధిని మరింత విస్తరించుకోనుంది. ముంబైకి చెందిన ప్రముఖ టెక్ కంపెనీ థర్డ్వేర్ సొల్యూషన్స్ను టేకోవర్ చేయనుంది. ఈ కంపెనీకి చెందిన వంద శాతం స్టేక్స్ను కొనుగోలు చేయనుంది. దీనికోసం 42 మిలియన్ డాలర్లను ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయనుంది. ఈ మేరకు టెక్ మహీంద్ర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అనంతరం ఈ టేకోవర్ వివరాలను వెల్లడిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ముంబైకి చెందిన ఐటీ సర్వీసెస్ కంపెనీ థర్డ్వేర్ సొల్యూషన్స్. 1995లో ఏర్పాటైన సంస్థ ఇది. 850 మందికి పైగా ఉద్యోగులు ఇందులో పని చేస్తోన్నారు. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఎంటర్ప్రైస్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, రోబొటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఇండస్ట్రీయల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సహా సాఫ్ట్వేర్ కంపెనీలకు బిజినెస్ అప్లికేషన్స్, కన్సల్టింగ్, డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ సేవలను అందిస్తోంది. ఎర్న్ అవుట్స్తో కలుపుకొని ఈ కంపెనీని వందశాతం మేర టేకోవర్ చేయాలని టెక్ మహీంద్ర నిర్ణయించింది.

ఈ సంవత్సరం మే 31వ తేదీ నాటికి టేకోవర్కు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని టెక్ మహీంద్ర తెలిపింది. మూడు సంవత్సరాలుగా థర్డ్వేర్ సొల్యూషన్స్ కంపెనీ నిలకడగా నికర లాభాలను ఆర్జిస్తూ వస్తోంది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో థర్డ్వేర్ సొల్యూషన్స్ 210.62 కోట్ల రూపాయల టర్నోవర్ను సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 215.56 కోట్ల రూపాయలు, 2018-19లో 225.44 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ను నమోదు చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి 31వ తేదీ నాటికి 226.5 కోట్ల రూపాయల టర్నోవర్ను అందుకుంది. కాగా- శుక్రవారం నాటి క్లోజింగ్ ట్రేడింగ్లో టెక్ మహీంద్ర షేర్లు కొంత పుంజుకోగలిగాయి. 0.13 శాతం మేర మెరుగుపడ్డాయి. ఒక్కో షేర్ ధర 1,486.95 రూపాయల వద్ద ముగిసింది. కొద్దిరోజులుగా పాతాళానికి పడుతూ వస్తోన్న షేర్ మార్కెట్.. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ కొంతమేర నిలకడగా ఉంటోంది.
More From GoodReturns

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications