Infosys: ఐటీ కంపెనీలు ప్రస్తుతం చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ క్రమంలో అంతర్జాతీయ కంపెనీలు నిర్ధక్షణ్యంగా వ్యవహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. ఇండియన్ కంపెనీలు మాత్రం పొమ్మనలేక పొగపెట్టే పనులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా చేసిన పని ఐటీ రంగంలో భయాందోళనలకు కారణంగా నిలుస్తోంది.

అసలు ఏమైంది..
వ్యాపార విస్తరణలో భాగంగా కంపెనీలు కొన్ని నెలల కిందట ఇన్ఫోసిస్ వందల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకుంది. వారికి ఆఫర్ లెటర్లను సైతం అందించింది. ఇది జరిగి దాదాపు 8 నెలలు గడుస్తోంది. పైగా వారందరూ కంపెనీలో ఉద్యోగాలు సంపాదించటంపై సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలో కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మంది ఉసూరు మంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కంపెనీ ఏం చేసిందంటే..
ప్రస్తుత తరుణంలో భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్మెంట్ పేరుతో ఒక పరీక్షను నిర్వహించింది. ఇందులో విఫలమైన వందలాది మందిని తొలగించినట్లు ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ పరీక్ష ద్వారా కంపెనీ దాదాపు 600 మంది ఫ్రెషర్లను తొలగించిందని తెలుస్తోంది. ఇన్నాళ్లుగా వేచి ఉన్నవారు చివరికి ఇలా జరగటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫ్రెషర్ చెప్పిన వాస్తవాలు..
2022 ఆగస్టులో తాను కంపెనీలో పనిచేయటం ప్రారంభించినట్లు ఫ్రెషర్ వెల్లడించాడు. తనకు కంపెనీ SAP ABAP స్ట్రీమ్ కోసం శిక్షణ ఇచ్చినట్లు తెలిపాడు. తనతో పాటు మెుత్తం 150 మంది పరీక్ష రాయగా కేవలం 60 మంది మాత్రమే ఉత్తీర్ణులైనట్లు తెలిపాడు. మిగిలిన వారంతా రెండు వారాల కిందట తొలగించబడ్డారని అతడు వెల్లడించాడు. ఇలా ఇన్ఫోసిస్ నిర్వహించిన అంతర్గత పరీక్షలో గత కొన్ని నెలలుగా దాదాపు 600 మంది తొలగించబడినట్లు సమాచారం.

జూలైకి ముందు చేరినవారు..
కంపెనీలో జూలై 2022కి ముందు చేరిన ఫ్రెషర్ల విషయంలో మాత్రం ఇలా జరగలేదని తెలుస్తోంది. వారు కంపెనీ నిర్వహించిన పరీక్షలో ఫెయిల్ అయినప్పటికీ వారిని కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించలేదని తాజాగా జాబ్ కోల్పోయినవారు తెలిపారు. ఆన్బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న తమకు 8 నెలల తర్వాత ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావటంపై వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇన్నాళ్లు ఆన్ బోర్డింగ్ కోసం వేచి ఉన్నానని, ఎలాంటి ఆదాయం లేదని, పైగా తన రెజ్యూమ్ లో గ్యాప్ ఉందని పరీక్షలో విఫలమైన ఒక ఫ్రెషర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications