ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆటో రంగంలో మందగమనం కొనసాగుతోంది. దీంతో వివిధ రకాల వాహనాల సేల్స్ పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఉద్యోగుల కోసం వాలంటరీ రిటైర్మెంట్ స్కీం (VRS) తీసుకు వచ్చింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆటో, సాఫ్టువేర్, ఎఫ్ఎంసీజీ రంగాలు ఉద్యోగులను తగ్గించుకుంటోన్న విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దీపనలు ప్రకటించింది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మందగమనం ప్రభావం భారత్ పైనా ఉంది.

ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు
సేల్స్ పడిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న టాటా మోటర్స్ ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు నిర్వహణ ఖర్చుల్ని తగ్గించుకుంటోంది. ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా 1,600 మంది ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది.

ఉద్యోగులపై ఖర్చు ఎక్కువ..
వీఆర్ఎస్ పథకాన్ని ప్యాసింజర్, కమర్షియల్ వెహికిల్స్ సహా వివిధ డిపార్టుమెంట్లకు విస్తరించాలని భావిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగులపై ఖర్చు చాలా ఎక్కువ అవుతోందని, జేఎల్ఆర్లో అదనంగా ఉన్న సిబ్బందిని తొలగించిన యాజమాన్యం, ఇప్పుడు టాటా మోటర్స్లో 1,600 మందికి పైగా వీఆర్ఎస్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. అంతకుముందు ఏడాది కంటే ఈ ఏడాది టాటా మోటార్స్ కాస్ట్ కట్టింగ్ ప్లాన్ మరింత ఎక్కువగా ఉందంటున్నారు.

ఇతర సంస్థలు కూడా..
ఎక్కువ మంది ఉద్యోగులు ఉండటంతో పాటు 2020 ఏప్రిల్ నుంచి వస్తున్న కొత్త నిబంధనలు మరింత భారంగా మారుతున్నాయి. ఇప్పటికే హీరో మోటో కార్ప్, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రయివేటు లిమిటెడ్, అశోక్ లేలాండ్ లిమిటెడ్ తదితర కంపెనీలు ఈ ఏడాది ఇలాంటి పథకాలు ప్రకటించాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications