టాటా గ్రూప్కు చెందిన టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ (టాటా ఎండీ) సరికొత్త కరోనా టెస్టింగ్ పరికరాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న కరోనా టెస్టింగ్ టూల్స్తో పోలిస్తే ఇది మరింత సామర్థ్యం కలిగినదని కంపెనీ తెలిపింది. టాటా గ్రూప్ కోవిడ్ 19ను త్వరగా గుర్తించే కిట్ను సోమవారం ప్రారంభించింది. దీని ద్వారా కేవలం 90 నిమిషాల్లోనే కరోనా వైరస్ ఉనికిని గుర్తించవచ్చునని టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ లిమిటెడ్ తెలిపింది.

టాటా ఎండీ చెక్
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలాజీతో (సీఎస్ఐఆర్-ఐజీఐబీ) కలిసి టాటా ఎండీ చెక్ (TataMD CHECK) కిట్ను అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) నుండి ఈ పరీక్షలకు అనుమతులు వచ్చాయి. దేశంలోని డయోగ్నస్టిక్ కేంద్రాలు, హాస్పిటల్స్లో వంద రోజుల్లో ఈ పరికరాలు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

10 లక్షల కిట్లు
చెన్నై ప్లాంటులో నెలకు 10 లక్షల కిట్లను ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టాటా గ్రూప్ తెలిపింది. దేశవ్యాప్తంగా పరీక్షల సామర్థ్యాన్ని భారీగా పెంచే లక్ష్యంతో దీనిని ఆవిష్కరించినట్లు కంపెనీ సీఈవో గిరీష్ కృష్ణమూర్తి తెలిపారు. డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుతామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షల నిర్వహణను అందుబాటులోక తెచ్చేందుకు వివిధ ఆసుపత్రులు, వివిధ డయోగ్నస్టిక్ సెంటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతంఉన్న పరికరాలతో.. కొన్ని నమూనాలు ఒకేసారి పరీక్షించాల్సి ఉండగా, ఈ పరికరంతో అలాంటి షరతులు లేవన్నారు. అందుకే సాధ్యమైనంత వేగంగా నిర్ధారణ ఫలితం ఉంటుందన్నారు.

పెద్దగా ఖర్చులు, పరికరాలు అవసరంలేదు
టాటా ఎండీ చెక్ ద్వారా పరీక్షించేందుకు పెద్దగా ఖర్చులు, పరికరాలు అవసరం లేదని గిరీష్ కృష్ణమూర్తి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ఆధారంగా ఈ కిట్ పని చేస్తుందన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్లో కేసులు 8.6 లక్షలకు చేరుకున్నాయి. మొత్తం మరణాలు 127,104గా నమోదయ్యాయి. కరోనా కేసుల్లో 10.4 లక్షలతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికా, భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా, స్పెయిన్, అర్జెంటీనా, యూకే, కొలంబియా, మెక్సికో టాప్ 10లో ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications