పనితీరు బాగా లేదని ఆరోపిస్తూ టాటా సన్స్ ఛైర్మన్ పదవిని తొలగించిన సైరస్ మిస్త్రీ శుక్రవారం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో టాటా గ్రూప్ 2019 లో సర్దుబాటు చేసిన నికర నష్టం రూ .13,000 కోట్లు అని ఆసక్తికర అంశాలను పేర్కొన్నారు. మూడు దశాబ్దాల్లో జరిగిన ఘోరమైన నష్టాలను ఆయన అందులో ప్రస్తావించారు . గత డిసెంబర్లో ఎన్సిఎల్టిలో తనను పునరుద్ధరించటాన్ని సవాలు చేస్తూ టాటాలు వేసిన పిటిషన్కు ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ అంశాలు వెల్లడించారు .

సుప్రీంలో సైరస్ మిస్త్రీ వర్సెస్ టాటా
గ్రూప్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా 2012 డిసెంబర్లో ప్రపంచ స్థాయి గవర్నెన్స్ ప్రమాణాలకు కట్టుబడి పదవి నుండి వైదొలగినప్పటి నుండి టాటా సన్స్కు అన్ని ఖర్చులను తిరిగి చెల్లించాలని మిస్త్రీ కోరుతున్నారు. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సిఎల్ఎటి) యొక్క ఉత్తర్వులను డిసెంబర్ 18, 2019 న సవాలు చేసింది.టాటాస్ సుప్రీంకోర్టులో ఈ ఏడాది జనవరి ప్రారంభంలో వేసిన పిటీషన్ పై మే 29 న సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది మరియు సంబంధిత పార్టీలందరూ తమ సమాధానాలను నాలుగు వారాల్లో సమర్పించాలని కోరారు.

టాటా నష్టాల్లో .. నష్టం రూ.13 వేల కోట్లుంటుందన్న సైరస్ మిస్త్రీ
టాటాలు అఫిడవిట్లకు ప్రతిస్పందనగా మిస్త్రీ శుక్రవారం సమాధానాలు దాఖలు చేశారు. తన పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా లేదని నిరూపించడానికి టాటా గ్రూప్లో కామధేనువు వంటి టీసీఎస్ ఏటా చెల్లిస్తున్న 85 శాతం భారీ డివిడెండును మినహాయించి నష్టాలను లెక్క కట్టి చూపించారని కూడా మిస్త్రీ ఆరోపించారు. అదే లెక్కను ఈ రోజున కూడా పరిగణనలోకి తీసుకుని టీసీఎస్ డివిడెండును మినహాయించినట్టయితే నష్టం రూ.13 వేల కోట్లుంటుందని ఆయన అన్నారు.టాటాను నిండా ముంచేశారని ఆరోపించారు .

గ్రూప్ పనితీరు దారుణంగా దిగజారడానికి 12 టాటా ట్రస్ట్లదే బాధ్యత
ఇక గ్రూప్ పనితీరు దారుణంగా దిగజారడానికి 12 టాటా ట్రస్ట్లదే బాధ్యత అని ఆరోపిస్తూ పలు ప్రధాన నిర్ణయాల్లో కొందరు ట్రస్టీలు కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు . నిరూపించేందుకు తన వద్ద ఆధారాలున్నాయని, వారి కారణంగా ఇతర షేర్హోల్డర్లపై ప్రతికూల ప్రభావం పడిందని అన్నారు. ఇందుకు వారందరూ బాధ్యత వహించాల్సిందేనని ఆయన తెలిపారు. అలా కాకుండా తనను అకారణంగా తొలగించారని తన పని తీరు బాగా లేదన్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే తన పని తీరు విషయంలో కొద్ది వారాల ముందే నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ సంతృప్తి ప్రకటించిన విషయం మిస్త్రీ గుర్తు చేశారు.

2016తో పోల్చితే 2019లో నిర్వహణాపరమైన నష్టాలు 282 శాతం పెరిగాయి
2016తో పోల్చితే గత ఏడాది టాటా సన్స్ నిర్వహణాపరమైన నష్టాలు 282 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. రూ.550 కోట్ల నుంచి రూ.2100 కోట్లకు చేరాయంటూ వారసత్వంగా సంక్రమించిన కొన్ని ఇబ్బందుల కారణంగా ఇటీవల సంవత్సరాల్లో పనితీరు దారుణంగా దెబ్బ తిన్నదని ఆయన ఆరోపించారు. ఇక రతన్ హయాంలో కంపెనీకి సరైన పెట్టుబడి వ్యూహం లేదని ఆరోపించారు . ఏ ఒక్క ఏడాదీ ఎలాంటి వ్యూహపత్రం బోర్డుకు సమర్పించలేదని ఆయన తెలిపారు .

టాటా మునిగిపోయిన కారణం ఇదే
సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే భారత కార్పొరేట్ చరిత్రలో గ్రూప్ విలువపరంగా ఇంత భారీగా పతనం అయిందని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా సైరస్ మిస్త్రీ టాటా పరిస్థితి గురించి సుప్రీం కు ఇచ్చిన సమాధానంలో తన వాదన బలంగా వినిపించటమే కాదు టాటా ఘోరంగా నష్టాల్లో ఉందని పేర్కొన్నారు .
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications