ముంబై: టెలికం టారిఫ్ల పెంపు అనివార్యమని, ప్రస్తుతం ఉన్న డేటా, కాల్ ఛార్జీల ద్వారా టెల్కోలు నిలబడలేవని, కాబట్టి పెంపు అవసరమని, అయితే ఈ పెంపుకు ముందు మార్కెట్ పరిస్థితులు గమనించాల్సి ఉందని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మిట్టల్ మాట్లాడారు. మొబైల్ టారిఫ్ పెంపు, 4జీ స్పెక్ట్రం ఆక్షన్, 5జీలోకి చైనీస్ కంపెనీల ఎంట్రీ తదితర అంశాలపై స్పందించారు.

పెంచాల్సిందే
ప్రస్తుత టెలికం ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని, వాటిని పెంచవలసిన అవశ్యకత ఉందని సునీల్ మిట్టల్ అన్నారు. మార్కెట్ పరిస్థితులు పరిశీలించి కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయన్నారు. ఈ విషయంలో ఎయిర్టెల్ ఒక్కటి మాత్రమే పెంపు ద్వారా ముందుకు వెళ్లలేని పరిస్థితి అన్నారు. పరిశ్రమ కలిసి ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గతంలోను మిట్టల్ టారిఫ్ పెంపు ఉండాలన్నారు. నెలకు 16GB వినియోగానికి కేవలం రూ.160 సరికాదని, ఎన్నో దేశాలతో పోలిస్తే మన దేశంలో డేటా ప్యాక్ చాలా తక్కువగా ఉందని చెప్పారు. కస్టమర్ నుండి వచ్చే సగటు ఆదాయం-ARPU రూ.200 కంటే పైనఉండాలన్నారు. ప్రస్తుతం టెల్కోల ఆర్పు 150కి అటు ఇటుగా మాత్రమే ఉన్నాయి. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్టెల్ ARPU రూ.162గా నమోదయింది.

చైనా కంపెనీలపై...
చైనా టెలికం పరికరాలను, అక్కడి కంపెనీలను 5G నెట్ వర్క్లోకి అనుమతించాలా అనే అంశంపై కూడా మిట్టల్ స్పందించారు. ఇది చాలా పెద్ద ప్రశ్న అని, ఇది దేశం (ప్రభుత్వం) నిర్ణయమని, దేశం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని అందరూ తప్పకుండా అంగీకరిస్తారన్నారు. 5G స్పెక్ట్రం ధరలు కంపెనీలకు అందుబాటులో లేవన్నారు.

అగ్రరాజ్యాంలోను పరిమితంగానే...
భవిష్యత్తు తరం సేవలు అందించేందుకు భారత్కు ఇంకా సమయం ఉందన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే మనం ఏమీ వెనుకబడలేదన్నారు. యూరోప్, బ్రిటన్, అమెరికా వంటి అగ్రరాజ్యాల్లోను 5G కవరేజీ పరిమితంగానే అందుబాటులోకి వచ్చిందన్నారు. టెలిగం రెగ్యులేటర్ అథారిటీ (TRAI) డేటా ప్రకారం దేశంలో జియో వైర్ లెస్ మార్కెట్ షేర్ 35 శాతం కాగా, ఎయిర్టెల్ 38 శాతం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications