Farmers: వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం తనవంతు సాయాన్ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో అన్నదాతలకు ఉపయోగపడే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇది వారికి నిజంగానే ఊరటను ఇచ్చే పెద్ద వార్త అని చెప్పుకోవాలి.

ఆన్ లైన్ లో..
ఇంట్లో వస్తువులను ఆన్ లైన్ లో ఆర్డర్ చేసినట్లుగానే ఇకపై రైతులు తమకు వ్యవసాయంలో అవసరమైన పురుగు మందులను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా పురుగు మందులు ఆర్డర్ చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పెస్టిసైడ్స్ రూల్స్ సవరించింది. దీంతో రైతులు ఇకపై వారికి వ్యవసాయంలో అవసరమైన వాటిని ఇంటి వద్ద నుంచే ఆర్డర్ చేసి డెలివరీ పొందొచ్చు.

సమస్యకు పరిష్కారం..
సాధారణంగా ఊళ్లలోని రైతులు పెస్టిసైడ్స్ డీలర్లను నమ్మి వారు ఇచ్చే పురుగు మందులను వినియోగిస్తుంటారు. కొన్ని సార్లు రైతులు అడిగిన బ్రాండ్ పెస్టిసైడ్స్ రిమోట్ ప్రాంతాల్లో అందుబాటులో ఉండవు. అలాంటి సందర్బంలో నయా ఆన్ లైన్ పద్ధతి ద్వారా ఎక్కడి నుంచైనా తమకు అవసరమైన వాటిని ఆర్డర్ చేసి నేరుగా ఇంచి వద్దకే తెప్పించుకోవచ్చు.

లైసెన్స్..
ఆన్ లైన్ లో క్రిమిసంహారకాలను విక్రయించటానికి సంస్థలు ముందుగా అందుకోసం ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు మాత్రమే వీటిని విక్రయించటానికి అర్హులని తెలుస్తోంది. ఆన్ లైన్ విధానాన్ని తీసుకురావటం వ్యవసాయాన్ని సులభతరం చేయటంతో పాటు దేశ వ్యాప్తంగా కోట్ల మంది రైతులకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందని తెలుస్తోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications