దేశంలో స్మార్ట్ ఫోన్ విక్రయాలు జోరుగా ఉన్నాయి. 2020 జూలై నుండి డిసెంబర్ మధ్య కాలంలో 10 కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేశారు. ఒక ఆరు నెలల కాలంలో ఈ స్థాయి అమ్మకాలు జరగడం ఇదే మొదటిసారి. మొత్తం మొబైల్ మార్కెట్లో శాంసంగ్ 19 శాతం వాటాతో లీడర్గా నిలిచింది. అయితే అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో మాత్రం 27 శాతం వాటాతో చైనాకు చెందిన షావోమీ మొదటిస్థానంలో ఉంది. కరోనా, లాక్ డౌన్, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం వంటి వివిధ కారణాలతో గత ఏడాది మొదటి అర్ధ సంవత్సరంలో ఫోన్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. మార్కెట్ను తిరిగి గాడిలో పెట్టేందుకు కంపెనీలు రంగంలోకి దిగాయి. దీంతో రెండో అర్ధ సంవత్సరంలో సేల్స్ పెరిగాయి.
ప్రస్తుత ఏడాది స్మార్ట్ ఫోన్ మార్కెట్ వృద్ధి పది శాతం నమోదు కావొచ్చునని అంచనాలు ఉన్నాయి. 5జీ మోడల్ విక్రయాలు పది రెట్లు పెరిగి 3 కోట్ల యూనిట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బేసిక్ ఫోన్ యూజర్లు కూడా స్మార్ట్ ఫోన్ వైపు మరలుతున్నారు. అన్ని ధరల్లోను ఆకట్టుకునే ఫీచర్లతో ఎన్నో మోడల్స్ వస్తున్నాయి. ఇవి కూడా రూ.20వేల లోపు, రూ.10వేల లోపు వస్తున్నాయి. దీంతో యూజర్లు స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.

2020లో స్మార్ట్ఫోన్ సగటు విక్రయ ధర రూ.13,000గా ఉంది. ప్రస్తుతం ఇది రూ.14,000 లకు చేరినట్లు చెబుతున్నారు. సగటు విక్రయ ధర రూ.15వేలకు పెరగవచ్చునని భావిస్తున్నారు. 5జీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. 58 శాతం వాటాతో వన్ ప్లస్ ముందు ఉంది. ఆ తర్వాత యాపిల్ 20 శాతం ఉంది. 2020 అక్టోబర్-డిసెంబర్ కాలంలో శాంసంగ్ వాటా 20 శాతంగా ఉంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications