న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాల్లో సెస్, సర్చార్జీ వాటా తొమ్మిదేళ్లలో రెట్టింపు అయింది. 201-12లో ఈ వాటా 10.4 శాతంగా ఉండగా, తాజాగా 19.9 శాతానికి చేరుకుందని ఇండియా రేటింగ్స్ తన నివేదికలో తెలిపింది. 15వ ఫైనాన్స్ కమిషన్ విధానం కింద కేంద్రం వసూలు చేసే సెస్, సర్ఛార్జీలను రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన అవసరం లేదు. అదే సమయంలో రాష్ట్రాలకు పరిహారం కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ పెంచాలని సూచించింది. మంగళవారం ఇండియా రేటింగ్స్ నివేదిక విడుదలైంది.

ఏపీ తెలంగాణలకు ఎంత తగ్గిందంటే
కేంద్రం నుండి రాష్ట్రాలకు బదలీ అయ్యే ఆర్థికేతర కమీషన్లు 2019-20లో 48.6 శాతానికి పరిమితమయ్యాయి. 2011-12లో ఇది 53.4 శాతంగా ఉంది. కేంద్రం ఇంకా రాష్ట్రాలకు ఇచ్చే రూ.1.8 లక్షల కోట్ల గ్రాంట్స్ ప్రతిపాదనలు అంగీకరించాలి. తాజా ఫైనాన్స్ కమిషన్ నివేదిక ప్రకారం ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గింది. ఆంధ్రప్రదేశ్కు 35 బేసిస్ పాయింట్లు తగ్గి 4.05 శాతానికి పరిమితమైంది. తెలంగాణకు 40 బేసిస్ పాయింట్లు తగ్గి 2.10 శాతంగా ఉంది. అసోంకు 24 బేసిస్ పాయింట్లు కర్నాటకకు 118, కేరళకు 60 తగ్గాయి.

మహారాష్ట్రకు పెరిగిన వాటా
ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గగా, మహారాష్ట్ర అత్యధికంగా 64 బేసిస్ పాయింట్ల మేర కేంద్ర పన్నుల్లో వాటాను పెంచుకుంది. రాజస్థాన్ 38 బేసిస్ పాయింట్లు, అరుణాచల్ ప్రదేశ్ 33, గుజరాత్ 31 బేసిస్ పాయింట్ల మేర వాటా పెంచుకుంది.

ఉత్తర ప్రదేశ్ టాప్
కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్లో మొదటి అయిదు రాష్ట్రాల్లో 16.3 శాతంతో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా బీహార్ 9.1 శాతం, పశ్చిమ బెంగాల్ 7.7 శాతం, మధ్యప్రదేశ్ 7.3 శాతం, మహారాష్ట్ర 6.4 శాతంతో ఉన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications