ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్.. ఇవ్వాళ భారీగా పతనమైంది. సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలిపోయాయి. షేర్లన్నీ రెడ్ జోన్లో కనిపించాయి. అన్ని సెక్టోరల్ షేర్లన్నీ మఠాష్ అయ్యాయి. ఐటీ, రియాల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్.. ఇలా దాదాపు అన్ని సెగ్మెంట్స్కు చెందిన షేర్లు నష్టాలను చవి చూశాయి. బెంచ్మార్క్ ఇండైసెస్ అన్నీ మైనస్లల్లో పడిపోయాయి.

1,500 పాయింట్లు లాస్..
ఈ ఉదయం బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో 1,500 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్ ఆరంభమైంది. సెన్సెక్స్ 1,415.89 పాయింట్ల నష్టంతో మొదలైంది. 52,887.55 పాయింట్లతో ప్రారంభమైన ట్రేడింగ్ ఆ తరువాత ఇంకా కిందికి దిగజారింది. ఒకదశలో 52,740.93 పాయింట్లకు క్షీణించింది. కొంత తేరుకుంది. తొలి గంట గడిచే సమయానికి 52,867 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

అదే బాటలో నిఫ్టీ..
నిఫ్టీ కూడా అదే బాటలో నడిచింది. 420 పాయింట్లను నష్టపోయింది. తొలి గంటలో 15,781 పాయింట్ల మేర పతనమైంది. 15,877.55 పాయింట్లతో ట్రేడింగ్ ఆరంభమైన నిఫ్టీ.. ఏ దశలోనూ పుంజుకోలేదు. మరింత క్షీణిస్తూ వచ్చింది. కనిష్ఠంగా 15,752.80 పాయింట్లకు దిగజారింది. తొలిగంట ముగిసే సమయానికి 5,788.65 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.

వారం తొలిరోజే..
వారం తొలిరోజే నష్టాలను చవి చూడాల్సి రావడంల ఇన్వెస్టర్లకు ఉసూరుమనిపించింది. ఐటీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, స్టీల్.. సెగ్మెంట్స్కు చెందిన షేర్లు నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో వంటి ఐటీ షేర్లు దెబ్బతిన్నాయి. వాటితో పాటు ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్కు చెందిన హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్, ఐటీసీ స్టాక్స్ ధరలు పడిపోయాయి.

క్రూడాయిల్ ఎఫెక్ట్..
బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఆసియన్ పెయింట్స్ షేర్లు రెండుశాతం మేర క్షీణించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు కూడా ఇవ్వాళ నష్టాలబారిన పడ్డాయి. మరింత దిగజారడం కనిపించింది. ఇంట్రాడే ట్రేడింగ్ మొత్తం ఇలాగే ఉండొచ్చంటూ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. సౌదీ అరేబియా క్రూడాయిల్ రేట్లను పెంచడం, రిటైల్ ద్రవ్యోల్బణం.. మార్కెట్ను ప్రభావితం చేస్తోన్నాయని చెబుతున్నాయి.

నష్టపోయిన షేర్లివే..
నెస్ట్లె ఇండియా, హిందుస్తాన్ యూనిలివర్, మారుతి సుజుకి, సన్ ఫార్మా, భారతి ఎయిర్టెల్, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టైటాన్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్ర, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్.. ఇలా అన్ని సెగ్మెంట్స్ షేర్లు నష్టపోయాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

డబుల్ బెడ్ రూంకు నెలకు రూ. లక్ష అద్దె.. ముంబైలో హౌస్ రెంట్పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications