ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

Stock Market Today: పశ్చిమాసియాలో వేగంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారత స్టాక్ మార్కెట్‌లో కూడా ఈ యుద్ద ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. శుక్రవారం అస్థిర ట్రేడింగ్ మధ్య భారత ఈక్విటీ మార్కెట్లు క్షీణించగా.. పెట్టుబడిదారుల రిస్క్ ఎక్కువయింది. సోమవారం ప్రారంభ ట్రేడింగ్ కూడా సులభంగా ఉండడం లేదు. నిఫ్టీ రోజూవారి పతనం, GIFT నిఫ్టీలో గ్యాప్-డౌన్ ప్రారంభం మార్కెట్ పరిస్థితిని సూచిస్తుంది.

సోమవారం ప్రారంభం సమయంలో GIFT నిఫ్టీ 728 పాయింట్లు లేదా 2.96 శాతం పడిపోయి 23,846 వద్ద ట్రేడింగ్ అయ్యింది. విశ్లేషకుల ప్రకారం.. నిఫ్టీ సమీప కాలంలో 24 వేల చుట్టూ లేదా అంతకంటే తక్కువకు పడవచ్చు. 25 వేల స్థాయి బలమైన ప్రతిఘటనగా ఉంది. దీన్ని దాటే వరకు అమ్మకాలు ఎక్కువగా ఉండే అవకాశముంది.

GIFT Nifty GIFT Nifty 23 761 India stock market today NSE Nifty update Indian equity market news stock market crash Brent crude oil price crude oil 114 oil price surge global market volatility oil supply fears 23 761 NSE 114

మార్కెట్‌లో పెరుగుతున్న భయాన్ని ఇండియా VIX సూచిస్తోంది. ఇది 11.3 శాతం పెరిగి 19.88కి చేరగా.. పెట్టుబడిదారుల ఆందోళన పెరిగినట్లు తెలుస్తోంది. ఆసియా మార్కెట్లు కూడా పడిపోవడంతో పరిస్థితి మరింత అస్థిరంగా మారింది. జపాన్ టాపిక్స్ 5.4 శాతం క్షీణించగా.. ఆస్ట్రేలియా S&P/ASX 200 4 శాతం పడిపోయింది. హాంకాంగ్, నిక్కీ ఫ్యూచర్స్, నాస్‌డాక్ 100 ఫ్యూచర్స్ కూడా 2 శాతం వరకు తగ్గాయి.

వాల్ స్ట్రీట్ కూడా ఒత్తిడితో ముగిసింది. అమెరికా కార్మిక మార్కెట్ బలహీనత, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు దాదాపు 12 శాతం పెరిగాయి. దీంతో పెట్టుబడిదారుల భయం కూడా పెరిగింది. సోమవారం ప్రారంభంలో బ్రెంట్ ముడి చమురు ధర 114 డాలర్లకు పైగా చేరింది. ఇది జూలై 2022 తర్వాత అత్యధిక స్థాయిగా చెప్పుకోవచ్చు. హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరాలో అంతరాయం ఏర్పడిన కారణంగా ఈ పెరుగుదల వచ్చింది.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగారం 2 శాతం తగ్గింది. పెట్టుబడిదారులు డాలర్‌ను సురక్షిత ఆస్తిగా ఇష్టపడగా.. ముడి చమురు ధరలు 100 డాలర్లు దాటిన తరువాత డాలర్ మూడు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. F&O విభాగంలో కొన్ని షేర్లు నిషేధంలో ఉన్నాయి. సాధారణంగా స్టాక్ 95 శాతం తేడా దాటినప్పుడు తాత్కాలికంగా F&O ట్రేడింగ్ నిషేధం అమలు చేయబడుతుంది. విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) శుక్రవారం సుమారు రూ. 6,030 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు) రూ. 6,971 కోట్లు కొనుగోలు చేశారు. ఇది మార్కెట్‌కు కొంత మద్దతు అందించింది.

చమురు ధరల పెరుగుదల, రిస్క్‑ఆన్ మూడ్, అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా రూపాయి తీవ్ర ఒత్తిడిలో ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు తగ్గి 91.82 వద్ద ముగిసింది. ఇది భారత మార్కెట్‌లో అస్థిరతను మరింతగా పెంచింది. ఈ పరిస్థితులు రాబోయే వారాల్లో భారత స్టాక్ మార్కెట్, గ్లోబల్ ఇంధన, ఆర్థిక మార్కెట్లపై కీలక ప్రభావం చూపవచ్చు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+