ముంబై: దేశంలో లీడ్ బ్యాంక్గా గుర్తింపు పొందింది.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశవ్యాప్తంగా అనేక శాఖా కార్యాలయాలను కలిగి ఉంది. వేలాదిమంది ఉద్యోగులు పని చేస్తోన్నారు. అదే స్థాయిలో ఏటీఎంల ద్వారా సేవలను అందిస్తోంది. దానికి అనుగుణంగా- ఆన్ప్లాట్ ప్లాట్ఫామ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. యాప్స్ను వినియోగంలోకి తెచ్చింది. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తోంది ఎస్బీఐ మేనేజ్మెంట్.
యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ ప్లాట్ఫామ్స్ ద్వారా బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునే సౌకర్యాన్ని తన ఖాతాదారుల కోసం ప్రవేశపెట్టింది. అవేకాకుండా- తన ఖాతాదారులకు ఎప్పటికప్పుడు సమాచారాలను తెలియజేయడానికి ఫేస్బుక్, ట్విట్టర్ వంటి మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్స్ను కూడా ఎస్బీఐ మేనేజ్మెంట్ వినియోగించుకుంటోంది. అత్యధిక సంఖ్యలో యూజర్లు ఉన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్స్గా పేరు తెచ్చుకుంది.

ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నప్పుడు.. వాటిని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎస్బీఐ మేనేజ్మెంట్ ఇప్పుడు అదే పని చేస్తోంది. అన్ని రాకల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను అండర్ మెయింటెనెన్స్ కిందికి చేర్చింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ పేమెంట్స్ చెల్లింపుల వ్యవస్థలన్నింటినీ మెయింటెనెన్స్ చేయనుంది.
ఎలాంటి అంతరాయాన్ని కలిగించకుండా ఉండేలా వాటిని అప్గ్రేడ్ చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మెయింటెనెన్స్ చేయాల్సి ఉన్నందున మూడు గంటల పాటు వాటి సేవలు స్తంభించిపోనున్నాయని ప్రకటించింది. శనివారం రాత్రి 10:35 నిమిషాల నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత 1:35 నిమిషాల వరకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సేవలు నిలిచిపోతాయని పేర్కొంది. ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరింది. 180 నిమిషాల పాటు వాటి సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ ప్రకటనను పోస్ట్ చేసింది ఎస్బీఐ మేనేజ్మెంట్.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications