ముంబై: దేశంలో లీడ్ బ్యాంక్గా గుర్తింపు పొందింది.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశవ్యాప్తంగా అనేక శాఖా కార్యాలయాలను కలిగి ఉంది. వేలాదిమంది ఉద్యోగులు పని చేస్తోన్నారు. అదే స్థాయిలో ఏటీఎంల ద్వారా సేవలను అందిస్తోంది. దానికి అనుగుణంగా- ఆన్ప్లాట్ ప్లాట్ఫామ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. యాప్స్ను వినియోగంలోకి తెచ్చింది. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తోంది ఎస్బీఐ మేనేజ్మెంట్.
యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ ప్లాట్ఫామ్స్ ద్వారా బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునే సౌకర్యాన్ని తన ఖాతాదారుల కోసం ప్రవేశపెట్టింది. అవేకాకుండా- తన ఖాతాదారులకు ఎప్పటికప్పుడు సమాచారాలను తెలియజేయడానికి ఫేస్బుక్, ట్విట్టర్ వంటి మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్స్ను కూడా ఎస్బీఐ మేనేజ్మెంట్ వినియోగించుకుంటోంది. అత్యధిక సంఖ్యలో యూజర్లు ఉన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్స్గా పేరు తెచ్చుకుంది.

ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నప్పుడు.. వాటిని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎస్బీఐ మేనేజ్మెంట్ ఇప్పుడు అదే పని చేస్తోంది. అన్ని రాకల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను అండర్ మెయింటెనెన్స్ కిందికి చేర్చింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ పేమెంట్స్ చెల్లింపుల వ్యవస్థలన్నింటినీ మెయింటెనెన్స్ చేయనుంది.
ఎలాంటి అంతరాయాన్ని కలిగించకుండా ఉండేలా వాటిని అప్గ్రేడ్ చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మెయింటెనెన్స్ చేయాల్సి ఉన్నందున మూడు గంటల పాటు వాటి సేవలు స్తంభించిపోనున్నాయని ప్రకటించింది. శనివారం రాత్రి 10:35 నిమిషాల నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత 1:35 నిమిషాల వరకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సేవలు నిలిచిపోతాయని పేర్కొంది. ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరింది. 180 నిమిషాల పాటు వాటి సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ ప్రకటనను పోస్ట్ చేసింది ఎస్బీఐ మేనేజ్మెంట్.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications