ముంబై: టాప్ నేషనలైజ్డ్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిజిటల్ ప్లాట్ఫామ్ సర్వీసులు ఆదివారం స్తంభించిపోనున్నాయి. మూడు గంటల పాటు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవీ పని చేయబోవు. ఒక్క ఆర్టీజీఎస్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. డిజిటల్ సర్వీసులన్నింటినీ అప్గ్రేడ్ చేస్తుండటమే దీనికి కారణమని ఎస్బీఐ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు డిజిటల్ సర్వీసులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
సాధారణంగా ఈ మూడు గంటల కాలాన్ని నాన్ పీక్ అవర్స్గా భావిస్తుంటారు. దీనికితోడు- ఆదివారం కావడం వల్ల ఆర్థికపరమైన కార్యకలాపాలేవీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండవు. అందుకే అప్గ్రెడేషన్ కోసం ఈ సమయాన్ని ఎస్బీఐ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. శనివారం కూడా దీన్ని చేపట్టింది. వ్యాపార కార్యకలాపాలన్నీ ముగిసిన తరువాత నెఫ్ట్లో టెక్నికల్ అప్గ్రెడేషన్ చేపడుతుంది. ఆదివారం నాడు దీన్ని మరింత విస్తరించబోతోంది.

శనివారం రాత్రి 11:45 నిమిషాల నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత 1:15 నిమిషాల వరకు టెక్నికల్ అప్గ్రేడ్ కార్యక్రమాలు కొనసాగాయి. రెండో విడతగా ఆదివారం మధ్యాహ్నం 2:40 నిమిషాల నుంచి సాయంత్రం 6:10 నిమిషాల వరకు కూడా దాన్ని కొనసాగిస్తామని వివరించింది. నెఫ్ట్ మాత్రమే కాకుండా.. తన పరిధిలోని యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్.. అన్నీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఆర్టీజీఎస్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఏటీఎం, క్యాష్ డిపాజిట్ మిషన్స్.. యధాతథంగా పనిచేస్తాయని స్పష్టం చేసింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications