ముంబై: టాప్ నేషనలైజ్డ్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిజిటల్ ప్లాట్ఫామ్ సర్వీసులు ఆదివారం స్తంభించిపోనున్నాయి. మూడు గంటల పాటు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవీ పని చేయబోవు. ఒక్క ఆర్టీజీఎస్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. డిజిటల్ సర్వీసులన్నింటినీ అప్గ్రేడ్ చేస్తుండటమే దీనికి కారణమని ఎస్బీఐ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు డిజిటల్ సర్వీసులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
సాధారణంగా ఈ మూడు గంటల కాలాన్ని నాన్ పీక్ అవర్స్గా భావిస్తుంటారు. దీనికితోడు- ఆదివారం కావడం వల్ల ఆర్థికపరమైన కార్యకలాపాలేవీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండవు. అందుకే అప్గ్రెడేషన్ కోసం ఈ సమయాన్ని ఎస్బీఐ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. శనివారం కూడా దీన్ని చేపట్టింది. వ్యాపార కార్యకలాపాలన్నీ ముగిసిన తరువాత నెఫ్ట్లో టెక్నికల్ అప్గ్రెడేషన్ చేపడుతుంది. ఆదివారం నాడు దీన్ని మరింత విస్తరించబోతోంది.

శనివారం రాత్రి 11:45 నిమిషాల నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత 1:15 నిమిషాల వరకు టెక్నికల్ అప్గ్రేడ్ కార్యక్రమాలు కొనసాగాయి. రెండో విడతగా ఆదివారం మధ్యాహ్నం 2:40 నిమిషాల నుంచి సాయంత్రం 6:10 నిమిషాల వరకు కూడా దాన్ని కొనసాగిస్తామని వివరించింది. నెఫ్ట్ మాత్రమే కాకుండా.. తన పరిధిలోని యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్.. అన్నీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఆర్టీజీఎస్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఏటీఎం, క్యాష్ డిపాజిట్ మిషన్స్.. యధాతథంగా పనిచేస్తాయని స్పష్టం చేసింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications