స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) తన డిజిటల్ ప్లాట్ఫామ్ యు ఓన్లీ నీడ్ వన్ (యోనో) యాప్ను ప్రత్యేక అనుబంధ సంస్థగా మార్చడానికి చురుకుగా ప్రయత్నిస్తోందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి చాలా గట్టిగా ఆలోచన జరుగుతోందని భాగస్వాములతో చర్చిస్తున్నామని దీనిని (యోనో) ప్రత్యేక అనుబంధ సంస్థగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నామని అని సొసైటీ ఫర్ వరల్డ్వైడ్ ఇంటర్బ్యాంక్ ఫైనాన్షియల్ నిర్వహించిన సిబోస్ 2020 అనే బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ కమ్యూనికేషన్స్ సమావేశంలో రజనీష్ కుమార్ చెప్పారు.

యోనో పై భాగస్వాములతో చర్చలు జరుగుతున్నాయన్న రజనీష్ కుమార్
చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, యోనో వాల్యుయేషన్ కూడా ఇంతవరకు జరగలేదని ఆయన అన్నారు. ఇటీవల, ఎస్బిఐ చైర్మన్ యోనో డిజిటల్ ప్లాట్ ఫామ్ లాభదాయక వేదిక అని, 40 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు . విషయం ఏమిటంటే, అది బ్యాంకులో అంతర్భాగం అయినందువలన అది లెక్కలలో ప్రతిబింబించదు. అది బ్యాంకులలో అంతర్భాగం కాకుంటే, దానికి వాల్యుయేషన్ ఉంటుంది. యోనోకు ఉన్న మార్కెట్ విలువ 40-50 బిలియన్ డాలర్లు కావచ్చు అని రజనీష్ కుమార్ వెల్లడించారు .

యోనో ప్రత్యేక అనుబంధ సంస్థగా మార్చటానికి ప్రయత్నాలు
ఎస్బిఐ తన వినియోగదారుల బ్యాంకింగ్, పెట్టుబడి మరియు షాపింగ్ అవసరాలకు సహాయపడటానికి 2017 నవంబర్లో యోనో ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. యోనో 27 మిలియన్లకు పైగా నమోదిత వినియోగదారులతో 56 మిలియన్లకు పైగా డౌన్లోడ్లతో కస్టమర్లకు సేవలు అందిస్తుంది . యోనో 20 కి పైగా విభాగాలలో 80 కి పైగా ఇ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది . యుకె మరియు మారిషస్ వంటి ప్రపంచ మార్కెట్లలోకి కూడా యోనో ప్రవేశించింది.

నిన్న రాత్రి కొత్త చైర్మన్ గా దినేశ్ కుమార్ ఖారా నియామకం
ఇక యోనో ప్రత్యేక అనుబంధ సంస్థగా మార్చటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రజనీష్ కుమార్ సదస్సులో చెప్పినప్పుడు ఆయన ఎస్బీఐ చైర్మన్ గా ఉన్నారు. నిన్నటితో ఆయన పదవీకాలం పూర్తయ్యింది . దీంతో ఎస్బీఐ చైర్మన్ గా తాజాగా దినేశ్ కుమార్ ఖారా నియమితులయ్యారు. మూడేళ్ల కాలం పాటు ఆయనను ఎస్బీఐ సారథిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. నేడు ఆయన రజనీష్ కుమార్ స్థానంలో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు . ఆయన ఇంత కాలం ఎస్బీఐ లో మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు . 1984నుండి ఎస్బీఐ లో ప్రొబేషనరీ ఆఫీసర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఖారా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా మూడేళ్ళపాటు ఎస్బీఐ చైర్మన్ గా కొనసాగనున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications