ప్రభుత్వరంగ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (SBI) కేంద్ర ప్రభుత్వం మూసివేయనుందా? దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీలను క్లోజ్ చేసి వాటి స్థానంలో ఈ-కార్నర్స్ను తీసుకు వస్తుందా? దీనిపై కేంద్రం స్పందించింది. దేశంలోని ఎస్బీఐ బ్రాంచీలను క్లోజ్ చేసే ఆలోచన లేదని, అలాగే కస్టమర్లకు మరింత సులువైన సేవల కోసం ఈ-కార్నర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

బ్రాంచీలు మూసివేయడం లేదు
ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంటుకు రాతపూర్వకంగా వెల్లడించారు. SBI ప్రస్తుత సిబ్బంది 2.5 లక్షల మంది ఉన్నారని, మార్చి 2021 నాటికి ఈ సంఖ్యను తగ్గించే ఆలోచన ఏమాత్రం లేదన్నారు. అలాగే, అన్ని బ్రాంచీలను మూసివేసి, వాటి స్థానంలో మాత్రమే ఈ-కార్నర్స్ తీసుకు వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పారు. ఇది బ్యాంకు అందరికీ ఊరట కలిగించే అంశం.

బ్రాంచీల మూసివేత, ఉద్యోగుల తగ్గింపుపై ప్రశ్న
SBI బ్రాంచీలను అన్నింటిని మూసివేసి, వాటికి ప్రత్యామ్నాయంగా ఈ-కార్నర్స్ను తీసుకు వస్తుందా? అని పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం చెప్పారు.

ఉద్యోగుల తొలగింపుపై ప్రశ్న
అంతేకాదు, 2021 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 16 లక్షల మంది ఉద్యోగులను తగ్గించాలని కేంద్రం భావిస్తుందా అని ప్రశ్నించారు. దీనికి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. కాగా, ఎస్బీఐ ఉద్యోగులు 2.5 లక్షల మంది ఉన్నారని, వారిని వచ్చే ఏడాదికి తగ్గించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications