ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్ బ్యాటరీలు లేకుండానే చెయ్యవచ్చని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా తమకు నచ్చిన ఎలక్ట్రిక్ బ్యాటరీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బ్యాటరీ పరిశ్రమకు ఊతం ఇవ్వడంతోపాటుగా,ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపించేలా ఉంది.

వేరే తయారీదారుల నుండి బ్యాటరీని కొనడం వల్ల వారంటీ సమస్యలు
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తను ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. కానీ మహీంద్రా ఎలక్ట్రిక్ మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. వాహన తయారీదారులే వాహన భద్రతకు బాధ్యులని , బ్యాటరీ లేకుండా విక్రయాలకు అనుమతించడం వల్ల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశముందని మహీంద్రా ఎలక్ట్రిక్ పేర్కొంది. వేరే తయారీదారుల వద్దనుండి బ్యాటరీని కొనడం వల్ల వారంటీ సమస్య కూడా ఏర్పడుతుందని ,సహజంగా వాహన తయారీదారుడు వాహనానికి సంబంధించిన వారంటీ ఇస్తారని పేర్కొంది.

ప్రపంచంలో ఏ దేశం ఇలాంటి వ్యవస్థను అనుమతించదు
వాహనం తయారీ, నాణ్యత పరీక్ష, విక్రయాలు అన్నిటికీ అనుసంధానం ఉండాలని , అలా కాకుంటే గందరగోళంగా పరిస్థితి తయారవుతుందని మహీంద్రా ఎలక్ట్రిక్ ఎండి మరియు సీఈవో మహేష్ బాబు అంటున్నారు. ముందుగా అమర్చిన బ్యాటరీలు లేకుండా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అమ్మకం మరియు రిజిస్ట్రేషన్ను అనుమతించాలన్న ప్రభుత్వ చర్యపై మహీంద్రా ఎలక్ట్రిక్ విరుచుకుపడింది. ప్రపంచంలో ఏ దేశమూ ఇలాంటి వ్యవస్థను అనుమతించదని, ఈ దశను ఆలోచించలేదని మహీంద్రా ఎలక్ట్రిక్ ఎండీ మరియు సిఈఓ మహేష్ బాబు అన్నారు.

ఈ నోటిఫికేషన్ గందరగోళం అన్న మహీంద్రా ఎలక్ట్రిక్
ఫ్యాక్టరీతో అమర్చిన బ్యాటరీలు లేకుండా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకం మరియు నమోదును ప్రభుత్వం అనుమతించటం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఊతం ఇచ్చేలా ఉన్నా వాహనాల్లో బ్యాటరీ మాత్రమే 30-40 శాతం వ్యయంతో కూడుకున్నది .అయితే వాహన తయారీ కంపెనీ కాకుండా ఇతర కంపెనీల ద్వారా బ్యాటరీలను విడిగా కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొనటంతో ఈ నోటిఫికేషన్ గందరగోళాన్ని సృష్టించిందని అన్నారు మహీంద్రా ఎలక్ట్రిక్ ఎండి మరియు సిఈవో మహేష్ బాబు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications