న్యూఢిల్లీ: వొడాఫోన్-కెయిర్న్ ఎనర్జీ కేసులో ఎదురుదెబ్బల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ పాలసీ(వెనకటి తేదీ నుండి పన్ను చెల్లించాలనే నోటీసులు)కి స్వస్తీ చెప్పాలని భావిస్తోంది. ఇందుకు పన్ను చట్టానికి సవరణలు చేయనుంది. ఇందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోకసభలో ది ట్యాక్సేషన్ లాస్(అమెండ్మెంట్) బిల్, 2021ని ప్రవేశ పెట్టారు. దీని ద్వారా 2012 మే 28వ తేదీకి ముందు జరిగిన భారత ఆస్తుల పరోక్ష బదలీ ట్రాన్సాక్షన్ పైన జారీ చేసిన పన్ను నోటీసులను వెనక్కి తీసుకోవచ్చు.
ఈ కేసుల్లో ఏవైనా రీఫండ్ మొత్తాలు ఉన్నప్పటికీ, వాటిని వడ్డీ లేకుండా చెల్లించడానికి కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ తరహాలో వసూలు చేసిన రూ.8100 కోట్లను తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే 2012 మే నెలకు ముందు జరిగిన భారత ఆస్తుల పరోక్ష బదిలీలపై విధించిన పన్ను నిర్దిష్ట షరతులకు లోబడి సున్నాగా మారిపోతుంది. ఇందుకు సంబంధించి ఏవైనా చట్టబద్ధ వివాదాలు ఉన్నప్పటికీ, వాటిని ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఐటీ చట్టంలో సవరణకు బిల్లు ప్రతిపాదించామని, తద్వారా భవిష్యత్తులో 2012 మే నెలకు ముందు జరిగిన ట్రాన్సాక్షన్స్ పైన వెనకటి తేదీ ఆధారంగా ఎలాంటి పన్ను నోటీసులు జారీ చేయమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
కొద్ది సంవత్సరాలుగా ఆర్థిక, మౌలిక రంగాల్లో ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టామని, దేశంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణాన్ని సృష్టించామని, అయితే వెనకటి తేదీ నుండి పన్ను చెల్లించాలని నోటీసులు ఇస్తుండటం పెట్టుబడుదార్లకు ఇబ్బందిగా మారిందని, కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవాల్సిన తరుణంలో, వేగవంతమైన వృద్ధికి, ఉపాధికి విదేశీ పెట్టుబడులు ఎంతో కీలకమని, అందుకే ఈ బిల్లు ప్రవేశ పెడుతున్నామని ప్రభుత్వం తెలిపింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications