రిలయన్స్ చేతికి మిల్క్ బాస్కెట్, రూ.300 కోట్ల డీల్!
ఈ-కామర్స్ దిగ్గజం బిగ్ బాస్కెట్ కొనుగోలుకు టాటా గ్రూప్ సిద్ధమైన విషయం తెలిసిందే. దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్ కూడా చిన్న చిన్న కంపెనీలను అక్వైర్ చేసుకుంటోంది. తాజాగా మిల్క్ బాస్కెట్ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపతుున్నట్లుగా తెలుస్తోంది. గత ఏడాది కాలంగా ఈ స్టార్టప్ను కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్నప్పటికీ, అంతర్గత వాటాదారుల మధ్య ఉన్న సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోందని అంటున్నారు.
ఇప్పుడు సమస్యలు తొలగిపోయాయని, ఈ సంస్థలు త్వరలో ఒప్పందంపై సంతకాలు చేస్తాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇరుసంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఇవి తుదిదశకు చేరుకున్నాయని తెలుస్తోంది. రిలయన్స్ - మిల్క్ బాస్కెట్ డీల్ వ్యాల్యూ దాదాపు రూ.300 కోట్లు. ట్రాన్సాక్షన్స్కు సంబంధించి త్వరలో వివరాలు వెల్లడి కావొచ్చునని చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో ముఖ్యంగా కరోనా సమయం నుండి ఈ-కామర్స్ వ్యాపారం భారీగా పుంజుకుంది. టాటా గ్రూప్ కూడా బిగ్ బాస్కెట్ ద్వారా రంగ ప్రవేశం చేసే ప్రయత్నాలు చేస్తోంది.