Rate Hike: ఇప్పటికే రెపో రేటును విపరీతంగా పెంచింది. దీంతో మార్కెట్లో లిక్విడిటీ తగ్గింది. అయితే ఇక రేట్ల తగ్గింపు చివరి అంకానికి చేరుకుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఆశలను అడియాశలు చేసే వార్త ఇప్పుడు మార్కెట్లోకి రావటం ప్రకంపనలు సృష్టిస్తోంది.

వాతావరణ ప్రకటన..
ఈ ఏడాది ఫిబ్రవరిలో రికార్డు స్థాయికి వేడి చేరుకుంది. ఎండాకాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు, వేడి గాలులు భారీగా పెరగటం కారణంగా భారతీయ రిజర్వు బ్యాంక్ మరిన్ని రేట్ల పెంపుకు వెళ్లవచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై దేశీయ రేటింగే ఏజెన్సీ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది.

ప్రధాన కారణాలు..
గడచిన 122 సంవత్సరాల్లో ఈ వేసవి అత్యంత వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలు గోధుమ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. గోధుమ ధరల పెరుగుదల డిసెంబర్, జనవరిలలో రిటైల్ ద్రవ్యోల్బణంలో పదవ వంతుకు పైగా కారణంగా నిలిచింది. ద్రవ్యోల్బణం లెక్కించే బాస్కెట్లో ఈ ధరల భారం పెరగటం కారణంగా రెపో రేటును రిజర్వు బ్యాంక్ పెంచవచ్చని రేటింగ్ సంస్థ హెచ్చరించింది.

పంజాబ్ ఉష్ణోగ్రతలు..
దేశం మళ్లీ "టెర్మినల్ హీట్ స్ట్రెస్"కు గురవుతుందని ఇండియా రేటింగ్స్ వెల్లడించింది. ప్రధానంగా గోధుమలు పండించే పంజాబ్ లో సగటున ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీల వరకు పెరిగాయని తెలుస్తోంది. అయితే ఈ కారణంగా గోధుమల ఉత్పత్తి 107.7 మిలియన్ టన్నులకు పడిపోవచ్చని దీని కారణంగా ధరలు పెరుగుతాయని అంచనా వేసింది.

కొత్త ఏడాది..
2023లో తొలి ఎంపీసీ సమావేశంలో రిజర్వు బ్యాంక్ రేట్ల దూకుడు తగ్గించి కేవలం 0.25 శాతం రెపో రేటును పెంచింది. దీంతో రెపో రేటు 6.50 శాతానికి చేరుకుంది. ఇప్పుడు రేటింగ్ సంస్థ అందించిన వివరాలను చూస్తుంటే రానున్న సమావేశంలో పెంపు కొనసాగవచ్చని రేటింగ్ సంస్థ తెలిపింది. గోధమలు, కూరగాయల, పాల ధరలు పెరగటం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దోహదపడనున్నట్లు అంచనా వేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications