డిజిటల్ పేమెంట్స్ భద్రత కోసం RBI మాస్టర్ డైరెక్షన్

ముంబై: డిజిటల్ చెల్లింపుల భద్రతకు సంబంధించి మాస్టర్‌ డైరెక్షన్ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులతో పాటు డిజిటల్ పేమెంట్ యాప్స్ అన్నీ ఈ మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయి. ఆన్‌లైన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌లలో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. డిజిటల్ చెల్లింపులు, నగదు బదిలీ సందర్భంగా తీసుకోవాల్సిన కనీస భద్రతా చర్యలను ఈ మార్గదర్శకాల్లో పేర్కోంది.

కొత్త మొబైల్ యాప్ విడుదలైన ఆరునెలల్లో బ్యాంకులు పాత మొబైల్ యాప్‌ను తొలగించాలని ఇందులో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఆన్ లైన్ మోసాలు పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులతో పాటు డిజిటల్ పేమెంట్ యాప్స్ నిబంధనలను కఠినతరం చేస్తోన్నట్లు ఆర్బీఐ తెలిపింది. మోసాలు, అడ్డంకులు, సైబర్ నేరాలు పెరగడం చూసిన తర్వాత ఈ నిబంధనలు రూపొందించింది.

RBI issues master direction to ensure security of digital payments

ప్రజలకు అవగాహన పెంచేందుకు, డిజిటల్ చెల్లింపుల విషయంలో వినియోగదారులు ఎదుర్కొనే సైబర్ అటాక్స్ గురించి ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, అలాగే, అలాంటి మోసాల నుండి ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలో వివరించాలని సూచించింది. 21 పేజీల మాస్టర్ సర్క్యులేషన్‌ను విడుదల చేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+