For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా నుండి మనమే త్వరగా కోలుకుంటాం, కానీ: ఆర్బీఐ మాజీ గవర్నర్ లాక్‌డౌన్ హెచ్చరిక

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చితికిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు అన్ని దేశాలు వణికిపోతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పందించారు. కరోనా-లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది పేదరికంలోకి నెట్టబడతారని ఆందోళన వ్యక్తం చేశారు.

చైనా కంపెనీల పెట్టుబడులపై భారత్ మరో కీలక నిర్ణయం, ఎందుకంటే?చైనా కంపెనీల పెట్టుబడులపై భారత్ మరో కీలక నిర్ణయం, ఎందుకంటే?

ఇతర దేశాలతో పోలిస్తే మనం త్వరగా కోలుకుంటాం

ఇతర దేశాలతో పోలిస్తే మనం త్వరగా కోలుకుంటాం

మిగతా దేశాలతో పోలిస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ కాస్త త్వరగా కోలుకుంటుందని దువ్వూరి సుబ్బారావు అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వృద్ధి రేటు తగ్గుతుందని, అయితే మూలధనం అలాగే ఉందని, ఫ్యాక్టరీలు, దుకాణాలు నిలదొక్కుకొనే ఉన్నాయన్నారు. లాక్ డౌన్ ఎత్తివేయగానే పనులకు వెళ్లేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారని, దీంతో రికవరీ త్వరగా ఉంటుందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన అవకాశాలు మన దేశానికి ఉంటాయని చెప్పారు.

కోట్లాదిమంది పేదరికంలోకి..

కోట్లాదిమంది పేదరికంలోకి..

ప్రస్తుత లాక్ డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తే మాత్రం కోట్లాదిమంది పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని సుబ్బారావు హెచ్చరించారు. మిగతా దేశాలతో పోలిస్తే వేగంగా కోలుకుంటుందని సంబరపడవద్దని, మనది చాలా పేద దేశమని, లాక్ డౌన్‌ను సాధ్యమైనంత త్వరగా ఎత్తివేయాలన్నారు. లేదంటే పరిస్థితులు చేయి దాటిపోతాయన్నారు.

3

వృద్ధి రేటు తక్కువే.. వీ ఆకారంలో కోలుకుంటాం

వృద్ధి రేటు తక్కువే.. వీ ఆకారంలో కోలుకుంటాం

ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు చాలామంది విశ్లేషకులు చెబుతున్న విధంగా సున్నా స్థాయికి తగ్గడం లేదా ప్రతికూలంగా ఉండే అవకాశమే ఉందని సుబ్బారావు చెప్పారు. కరోనాకు ముందే మందగమనం కారణంగా ఆర్థిక వృద్ధి కుదేలయిందని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థ వీ ఆకారంలో కోలుకుంటుందని చెప్పారు. తుపాన్లు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల తరహాలో కరోనా కారణంగా మన మూలధన ఆస్తులు ధ్వంసం కాలేదన్నారు. ఫ్యాక్టరీలు, దుకాణాలూ యథాతథంగా ఉన్నాయని, కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఇంగ్లీషు అక్షరం వీ ఆకారంలో కోలుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.

రుణాల చెల్లింపుకు పథకం

రుణాల చెల్లింపుకు పథకం

కరోనా కారణంగా బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు ఇచ్చే రుణాల చెల్లింపుకు పరపతి హామీ పథకం లాంటిది ప్రవేశ పెట్టాలని మాజీ డిప్యూటీ గవర్నర్ థోరట్ సూచించారు. లేకపోతే ఈ సంస్థలకు మరిన్ని నిధులు సమకూర్చాలని సూచించారు. వీటిలో ఏదో ఒకటి చేయాలని సూచన చేశారు. మొండి బకాయిల భయంతో అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు ముందుకు రావడం లేదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు మరింత ఆర్థిక మద్దతు ఉండాలన్నారు.

English summary

కరోనా నుండి మనమే త్వరగా కోలుకుంటాం, కానీ: ఆర్బీఐ మాజీ గవర్నర్ లాక్‌డౌన్ హెచ్చరిక | Prolonged Lockdown May Push Millions Into Margins of Subsistence: Duvvuri Subba Rao

A prolonged lockdown may possibly push millions of Indians into the "margins of subsistence", former RBI Governor Duvvuri Subba Rao said on Sunday while expecting a V curved recovery once the COVID-19 crisis ends and the turnaround in India to be faster than some economies.
Story first published: Monday, April 27, 2020, 10:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X