భారతదేశంలో ఉద్యోగులు/ప్రొఫెషనల్స్ ఆదాయం, పొదుపుకు సంబంధించి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు లింక్డిన్ సర్వేలో వెల్లడైంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యక్తులు, సంస్థల ఆదాయంపై ప్రభావం చూపుతోంది. అయితే తాజా సర్వేలో ఉద్యోగులు కాస్త ఆశాజనకంగా ఉన్నారు. వచ్చే ఆరు నెలల్లో తమ ఆదాయం, ఖర్చులు పెరుగుతాయని ప్రతి నలుగురిలో ఒక్కరు చెప్పడం గమనార్హం. జూన్ 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా దేశంలోని 1,351 మందిని సర్వే చేశారు. భవిష్యత్తు పైన, ముందు ముందు ఆర్థిక పరిస్థితిపై ఆశాభావం వ్యక్తం చేశారు.

గత సర్వే కంటే బెటర్
కరోనా మహమ్మారి కారణంగా అంతకుముందు మే 4వ తేదీ నుండి 17వ తేదీ వరకు చేసిన సర్వే కంటే తాజా సర్వేలో ఉద్యోగుల్లో భద్రతా భావం పెరిగింది. ఆదాయం, మిగులుపై సానుకూలంగా కనిపించారు. మొదటి సర్వేలో 1,464 మంది పాల్గొన్నారు. 20 శాతం మంది తమ ఆదాయం పెరుగుతుందని చెప్పగా, 27 శాతం మంది మిగులు, 23 శాతం మంది ఖర్చులు పెరుగుతాయన్నారు. తాజా సర్వేలో ప్రతి నలుగురిలో ఒకరు ఆదాయం పెరుగుతుందని, తమ ఖర్చులు పెరుగుతాయని అంచనా వేశారు. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ మిగులు, వ్యక్తిగత రికరింగ్ అప్పుల చెల్లింపు పెరుగుతుందని అంచనా వేశారు.

స్వల్పకాలిక, దీర్ఘకాలిక యాజమాన్య విశ్వాసం
స్వల్పకాలిక యాజమాన్య విశ్వాసం విషయానికి వస్తే 50 శాతం కార్పోరేట్ సేవ ప్రొఫెషనల్స్, 46 శాతం ఉత్పాదక ప్రొఫెషనల్స్, 41 శాతం ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్... తమ కంపెనీలు ఇప్పటి కంటే ఆరు నెలల తర్వాత మరింత మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు.దీర్ఘకాలిక యాజమాన్య విశ్వాసం విషయానికి సంబంధించి 64 శాతం మ్యానుఫ్యాక్చరింగ్, 60 శాతం కార్పోరేట్ సర్వీసెస్, 59 శాతం సాఫ్టువేర్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్... తమ కంపెనీల భవిష్యత్తు ఏడాది తర్వాత బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ ఆఫీస్
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ 38 శాతం జెన్ ఎక్స్ (40 ఏళ్ల నుండి 54 ఏళ్లు), 29 శాతం మంది బేబీ బూమర్స్ (55 ఏళ్లకు మించి) అనుమతిస్తే కంపెనీలకు వచ్చి పని చేయాలని భావిస్తున్నారు. జెన్ జెడ్ (25 ఏళ్ల లోపు), మిలీనియల్స్లో (25 నుండి 39 ఏళ్లు) ప్రతి ఒక్కరిలో ఒకరు ఇంటి నుండి పని సురక్షితంగా భావిస్తున్నారు. ప్రయాణం, భోజనం సమయంలో నిర్లక్ష్యంగా ఉండే కొందరితో ప్రమాదం ఉందని 55 శాతం మంది చెప్పారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications