ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సీతారామన్, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు వివిద రంగాలకు చెందిన వారితో భేటీ అవుతున్నారు. వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. తాజాగా, బడ్జెట్కు సంబంధించి ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా కేంద్రం బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతుందని, ఈ ఏడాది తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్కు మీ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నానని పేర్కొన్నారు. మీ సలహాలు, సూచనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని చెప్పారు. బడ్జెట్కు సలహాలు ఇవ్వాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే కోరారు.

కాగా, 2019-20 భారత జీడీపీ వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ఠస్థాయి 5 శాతానికి పరిమితం కానుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన విషయం తెలిసిందే. 2008-09లో 3.1 శాతంగా ఉన్న వృద్ధి రేటుకు ఆ తర్వాత ఇదే కనిష్ఠస్థాయి కానుంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదయింది. ఈసారి వృద్ధి క్షీణతకు వస్తు తయారీ రంగం పడకేయడమే ప్రధాన కారణమని జాతీయ గణాంకాల కార్యాలయం పేర్కొంది.
మంగళవారం జాతీయ ఆదాయంపై తొలి విడత ముందస్తు అంచనాలను విడుదల చేసింది. 2019-20లో వస్తు తయారీ రంగ వృద్ధి రెండు శాతానికి పడిపోవచ్చని అంచనా వేసింది. 2018-19లో మాన్యుఫాక్చరింగ్ రంగం 6.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. తయారీతో పాటు వ్యవసాయం, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా రంగాల పని తీరు కూడా పేలవంగా ఉందని, మైనింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ రంగాలు మాత్రం స్వల్పంగా పుంజుకున్నాయని నివేదిక తెలిపింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications