పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే 11 విడతలుగా డబ్బులు పంపిణీ చేసింది. అయితే 11వ విడతకు ముందు రైతులందరూ ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఈకేవైసీ చేసుకున్న వారికే 11వ విడత డబ్బులు పడతాయని చెప్పింది. అయితే కొందరు రైతులకు దీనిపై సరైన అవగాహన లేక ఈకేవైసీ చేసుకోలేదు. దీంతో వారికి 11వ విడత నిధులు ఆగిపోయాయి. అయితే ఇప్పటికైనా ఈకేవైసీ చేసుకోవాలని కేంద్రం అన్నదాతలను కోరుతోంది. ఈకేవైసీ చేసుకోవాలంటే ఆధార్ తో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలా అయితేనే ఈకేవైసీ చేసుకోవచ్చు.
ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలంటే దగ్గరిలోని మీ సేవ కేంద్రాలకు వెళ్తే మొబైల్ నెంబర్ లింక్ చేస్తారు. అయితే మొబైల్ నెంబర్ లింక్ ఒక్క ఈ పథకానికే కాదు అనేక ఆర్థిక లావాదేవీలకు కూడా ఉపయోగపడుతుంది. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిన తర్వాత సింపుల్ గా ఈకేవైసీ చేసుకోవచ్చు. మీరు మీ స్మార్ట్ ఫోన్ లో https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx టైప్ చేయగానే ఓటీపీ బెస్ ఈకేవైసీ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ కు ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీ ఈకైవైసీ పూర్తి అవుతుంది. ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం జూలై 31 వరకు గడువు ఇచ్చింది.

ఇక ఇప్పటికే 11వ విడత డబ్బులు వచ్చిన వారు https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx అని టైప్ చేస్తేబెనిఫిషరీ స్టేటస్ అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మొబైల్ నెంబర్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చ ఎంటర్ చేసి జెనరేట్ ఓటీపై క్లిక్ చేస్తే మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు డబ్బులు ఎప్పుడు పడ్డాయి. ఏ అకౌంట్ లో పడ్డాయో తెలుస్తుంది. అయితే ఈకేవైసీ తర్వాత మీ ఆధార్ ఎక్కడైతే లేటెస్ట్ గా అప్ డేట్ అవుతుందో ఆ బ్యాంకులోనే డబ్బులు పడతాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications