డిజిటల్ పేమెంట్ మేజర్ పేపాల్ బుధవారం గుడ్న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఈ కంపెనీకి ఇండియాలో 4500 మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా మరో వెయ్యిమందిని తీసుకోనున్నట్లు పేపాల్ ఇండియా తెలిపింది. భారత్లో డొమెస్టిక్ సేవలు ఎక్కువ కాలం కొనసాగించలేమని, భారత్లోని అంతర్జాతీయ సేవల పైన దృష్టి సారిస్తామని గతంలో తెలిపింది. తాజాగా మరో వెయ్యి మంది ఉద్యోగులను తీసుకోవడానికి సిద్ధమైంది. కొత్తగా తీసుకునే వెయ్యి ఉద్యోగాల్లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో ఉండనున్నాయి.
2021లో పెద్ద ఎత్తున ఇంజినీర్లను నియమించుకుంటామని తెలిపింది. సాఫ్టువేర్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, డేటా సైన్స్, రిస్క్ అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ స్ట్రీమ్స్ ఎంట్రీ, మిడ్ లెవల్, సీనియర్ రోల్స్లో నియామకాలు ఉంటాయని తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని డెవలప్మెంట్ కేంద్రాల్లో ఈ నియామకాలు ఉంటాయని తెలిపింది.

కరోనా నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులకు డిమాండ్ పెరిగిందని, ఈ నేపథ్యంలో తమ కేంద్రాల కీలకంగా మారనుందని పేపాల్ తెలిపింది. పేపాల్కు ప్రస్తుతం భారత్లో మూడు కేంద్రాలలో 4,500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. అమెరికా తర్వాత భారత్లోని సాంకేతిక కేంద్రాలు అతిపెద్దవని తెలిపింది. దేశంలో డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో కస్టమర్లు, వ్యాపారుల అవసరాలను తీర్చడంపై దృష్టి పెట్టామన్నారు. ఈ క్రమంలో తాజా నియామకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేపాల్ ఇండియా ప్రతినిధి గురుభట్ అన్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications