Electric Vehicles Fire: దేశంలోని అనేక కంపెనీలు తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో వరుస అగ్ని ప్రమాదాల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదే క్రమంలో ఓలా కంపెనీ తయారు చేసిన వాహనాల్లోనూ అనేక ప్రమాదాలు జరిగాయి. ఇదే తరుణంలో గతంలోనూ కంపెనీ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఇదే తరుణంలో కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ ఒక ట్వీట్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రమాదాలు సర్వసాధారణమేనని, అనేక అంతర్జాతీయ కంపెనీలు తయారు చేసిన వాహనాల్లోనూ ప్రమాదాలు జరుగుతున్నాయని తన ట్వీట్ లో తెలిపారు. ఇలాంటి ఘటనలు సాధారణమేనన్న రీతిలో ఆయన చేసిన ట్వీట్ పై నెటిజన్లు తమదైన శైలిలో రిప్లై ఇస్తున్నారు.

టాటా నెక్సన్ ఈవీలో అగ్ని ప్రమాదం..
నిన్న ముంబై నగర శివారులో టాటా గ్రూప్ తయారుచేసిన టాటా నెక్సన్ ఈవీ కారులో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సకాలంలో మంటలను ఆర్పినప్పటికీ.. ఈ ఘటన సమయంలో తీసిన ఒక వీడియో నెట్టింట్లో పోస్ట్ చేయగా దానిపై టాటా కంపెనీ స్పందించింది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రమాదానికి వెనుక కారణాలను కనుగొని వాటిని త్వరలోనే బహిర్గతం చేస్తామని బదులిచ్చింది టాటా మోటార్స్.
ఓలా సీఈవో ట్వీట్..
ఈ వీడియోపై స్పందిస్తూ.. ఓలా సీఈవో ఇలాంటి ప్రమాదాలు సాధారణమేనని అన్నారు. ఎలక్ట్రిక్ వాహానాల్లో ప్రమాదాలు చాలా అరుదుగా, చాలా తక్కువ సంఖ్యలో జరుగుతుంటాయని తన ట్వీట్ లో పేర్కొన్నారు. అసలు ప్రస్తుతం ఉన్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలా వద్దా అనే ఆందోళన, గందరగోళంలో వాహనదారులు ఉన్న క్రమంలో ఇలాంటి ట్వీట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ కు మద్దతిస్తున్నవారితో పాటు విమర్శలు చేస్తున్నవారు ఎక్కువగానే ఉన్నారు. ఏదేమైనా ప్రమాదాలను వీలైనంత వరకు జరగకుండా ఉండేలా తయారీ సంస్థలు నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని అనేక మంది వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications