ముంబై: బాంబే డైయింగ్ చైర్మన్ నస్లీ వాడియా సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. టాటా గ్రూప్కు చెందిన రతన్ టాటా సహా ఇతరులపై ఇదివరకు రూ.3వేల కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ దావాను ఇప్పుడు ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు పరువు నష్టం దావాలను అన్నింటిని వెనక్కి తీసుకున్నారు. దీంతో వాడియా - టాటా యుద్ధానికి తెరపడినట్లేనని భావిస్తున్నారు.
టాటా సన్స్ - సైరస్ మిస్త్రీ ఇష్యూ

సమస్యను పరిష్కరించుకోండి..
పరిణితి చెందిన వ్యక్తులుగా ఇద్దరు కూడా కేసులను పరిష్కరించుకోవాలని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే సూచించారు. దీంతో సోమవారం ఈ పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఉన్న వాడియాను పరువు తీసే ఉద్దేశ్యం తమకు లేదని టాటా ప్రకటన చేశారు. దీంతో పిటిషనర్ ప్రస్తుత పిటిషన్ను ఉపసంహరించుకోవాలని బెంచ్ సూచించింది. తాజాగా వాడియా పరువు నష్టం దావాలను ఉపసంహరించుకున్నారు.

ఏం జరిగిందంటే?
టాటా సన్స్ నుంచి ఆయన మిత్రుడు సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం వాడియా ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్లో అత్యంత సీనియర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అయిన నస్లీ వాడియాను తొలగించేందుకు నిర్ణయించింది. దీంతో రూ.3వేల కోట్లు పరిహారం కోరుతూ 2016 డిసెంబర్లో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఇందులో బోర్డు సభ్యులు అజయ్ పిరమల్, రణేంద్ర సేన్, విజయ్ సింగ్, వేణు శ్రీనివాసన్, రాల్ఫ్స్ స్పేత్, ఎఫ్ఎన్ సుబేదార్లతో పాటు మిస్త్రీ అనంతరం బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్ పేరును చేర్చారు.

కలిసి పరిష్కరించుకోండి..
2019 జూలై నెలలో బాంబే హైకోర్టు ఈ కేసును కొట్టి వేయడంతో వివాదం సుప్రీం కోర్టుకు చేరుకుంది. వాడియా, టాటా ఇరువురు కలిసి మాట్లాడుకొని, సమస్యను పరిష్కరించుకోవాలని జనవరి 6న సుప్రీం కోర్టు సూచించింది. కాగా, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా తన తొలగింపుపై సైరస్ మిస్త్రీ NCLATలో పిటిషన్ దాఖలు చేయడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై టాటా సన్స్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. మిస్త్రీ నియామకంపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications