కరోనా మహమ్మారి-లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ప్రస్తుతం ఉత్పత్తి లేదు. డిమాండ్ తగ్గింది. క్రమంగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తున్నారు. వ్యాపారాలు, సంస్థలు, కంపెనీలు తెరుచుకుంటున్నాయి. అయితే చాలా ఉద్యోగాలు పోవడం, వేతనాల్లో కోత వంటి కారణాల వల్ల మరికొన్ని రోజులు డిమాండ్ సన్నగిల్లుతుందనే వాదనలు ఉన్నాయి. మరోవైపు సప్లై చైన్ తెగిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ డిమాండ్-సరఫరాను బ్యాలెన్స్ చేయడం అన్నారు.

ఇది అతిపెద్ద సవాల్..
కంపెనీలు, వ్యాపారులకు కార్మికులు అందుబాటులో ఉండాలి. అప్పుడే ఉత్పత్తి పెరుగుతుంది. మరోవైపు ఉత్పత్తి పెరిగినా సరఫరా చైన్ ఉండాలి. దానికి తగిన డిమాండ్ ఉండాలని అభిప్రాయపడ్డారు దువ్వూరి. ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ సరఫరా-డిమాండ్ అంటున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన 'ది ఛాలెంజ్ ఆఫ్ కరోనా క్రైసిస్-ఎకనమిక్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూ'లో వెబినార్ ద్వారా ఆయన మాట్లాడారు. ఆరెంజ్ జోన్, రెడ్ జోన్లలో సప్లై చేయడం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

మేకిన్ ఇండియాకు రూ.20 లక్షల కోట్లు భేష్
కరోనా సంక్షోభంతో బ్యాంకుల ఎన్పీఐలు లేదా నిరర్థక ఆస్తులు మరింత పెరిగే ప్రమాదం ఉందని దువ్వూరి ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు ఈ భారం తగ్గించుకోవాలంటే రుణాల పునర్వ్యవస్థీకరణే మార్గమన్నారు. బ్యాంకులు రుణాలను పునరుద్ధరించి భారం తగ్గించుకోవాలన్నారు. కరోనా సంక్షోభం ఓ చక్రవ్యూహమన్నారు. దీనిని ఎదుర్కోవడంతో పాటు ఎలా బయటపడాలో కూడా తెలిసి ఉండాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ఉద్దీపన పథకం భారత్లో తయారీకి పెద్ద ఊతంలా పని చేస్తుందన్నారు.

మార్కెట్ ప్రతి చర్యలపై స్పృహ
ప్రభుత్వం స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల కోసం మార్కెట్ ప్రతిచర్యలపై స్పృహ కలిగి ఉండాల్సిన అవసరం ఉందని దువ్వూరి చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆర్బీఐ సీఆర్ఆర్ను (క్యాష్ రిజర్వ్ రేషియో) తగ్గించి ద్రవ్యతను ప్రేరేపించిందన్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు మారటోరియం విధించడమే కాకుండా బాండ్స్ కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఉత్పత్తి, ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించేందుకు రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సరఫరా చైన్లను ప్లాన్ చేసుకోవాలన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications