బీమా రంగంలో ఉన్న లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) సురక్షిత ప్రభుత్వ సెక్యూరిటీలు చేయడం, ప్రభుత్వరంగ సంస్థలను, బ్యాంకులను బెయిలవుట్ చేయడం తెలిసిందే. ఎల్ఐసీ ఆస్తులు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇటీవల పెద్ద మొత్తంలో లోన్ తీసుకొని బ్యాంకులకు ఎగవేయడం తెలిసిందే. బ్యాంకుల ఎన్పీఏలు పెరుగుతున్నాయి.

ఎల్ఐసీ డిఫాల్టర్లు డబుల్
అయితే ప్రభుత్వరంగ ఎల్ఐసీకి కూడా ఎన్పీఏల బాధ తప్పడం లేదు. గత అయిదేళ్లలో ఎల్ఐసీ ఎన్పీఏలు రెండింతలు పెరిగి రూ.30,000 కోట్లకు చేరుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తొలి 6నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) ఎల్ఐసీ గ్రాస్ ఎన్పీఏలు 6.10 శాతంగా ఉన్నాయి. వివిధ కారణాలతో ప్రయివేటు సెక్టార్ బ్యాంకుల ఎన్పీఏలు కూడా పెరుగుతున్నాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంలోని రెండో క్వార్టర్లో యస్ బ్యాంకు ఎన్పీఏలు 7.39 శాతానికి, ఐసీఐసీఐ బ్యాంకు ఎన్పీఏలు 6.37 శాతానికి, యాక్సిస్ బ్యాంకు ఎన్పీఏలు 5.03 శాతానికి చేరుకున్నాయి.

రూ.30,000 కోట్ల ఎన్పీఏలు
ఎల్ఐసీ ఆస్తులు రూ.36 లక్షల కోట్లకు పైగా ఉంటాయి. ఈ సంస్థకు 2019 సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్కు ఎన్పీఏలు రూ.30,000కోట్లు ఉన్నాయి. గ్రాస్ ఎన్పీఏలు 6.10 శాతంగా ఉంది. అయిదేళ్లలో ఎన్పీఏలు దాదాపు రెండింతలు అయ్యాయి. ఎల్ఐసీ దాదాపు ఎప్పుడు గ్రాస్ ఎన్పీఏలును 1.5 శాతం నుంచి 2 శాతం మధ్య ఉండేలా చూసుకుంటుంది.

జాబితా ఇదే..
ఎల్ఐసీ బిగ్ డిఫాల్టర్స్ జాబితాలో డక్కన్ క్రానికల్, ఎస్సార్ పోర్ట్, గామన్, IL&FS, భూషణ్ పవర్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, అలోక్ ఇండస్ట్రీస్, అంత్రాక్ ఆటో, ఏబీజీ షిప్యార్డ్, యూనిటెక్, జీవీకే పవర్, జీటీఎల్ వంటివి ఉన్నాయి. వాస్తవానికి ఎల్ఐసీ ప్రాఫిట్స్ ఏడాదికి రూ.2,600 కోట్ల వరకు ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications