ఢిల్లీ: రూపే కార్డు, యూపీఐ యాప్ ద్వారా జరిపే ట్రాన్సాక్షన్స్పై MDR (మర్చంట్ డిస్కౌంట్ రేట్)ను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రూ.50 కోట్లు ఆపై వార్షిక టర్నోవర్ ఉన్న అన్ని కంపెనీలు కస్టమర్లకు రూపే డెబిట్ కార్డు, యూపీఐ క్యూఆర్ ద్వారా చెల్లింపు విధానాన్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
రూపే డెబిట్ కార్డు, యూపీఐ క్యూఆర్ ద్వారా చెల్లింపు విధానాన్ని ఫిబ్రవరి 1, 2020 వరకు ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని లేదంటే ఆయా కంపెనీలకు రోజుకు రూ.5వేల జరిమానా విధిస్తామని తెలిపింది. రూపే కార్డు, యూపీఐ యాప్స్ ద్వారా జరిపే ట్రాన్సాక్షన్లపై MDR ఎత్తివేయనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో జరిగిన సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం తెలిసిందే.

జనవరి 1వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంది. డిజిటల్ మార్గంలో కస్టమర్ల నుంచి చెల్లింపులను స్వీకరించినందుకు బ్యాంకుకు వ్యాపారి చెల్లించే రుసుమునే MDRగా వ్యవహరిస్తారు. తాజా నిర్ణయంతో కస్టమర్లు, వ్యాపారులకు ఎండీఆర్ ఛార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇదిలా ఉండగా, కేంద్రం నిర్ణయంపై మార్కెట్ స్టేక్ హోల్డర్స్ నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications